Moviesకత్రీనా బ్లాక్ మెయిల్ చేసి మరీ రెమ్యూనరేషన్ పెంచుకున్న ఆ తెలుగు...

కత్రీనా బ్లాక్ మెయిల్ చేసి మరీ రెమ్యూనరేషన్ పెంచుకున్న ఆ తెలుగు సినిమా ఏంటో తెలుసా..??

రెండు ద‌శాబ్దాల క్రితం క‌త్రినా కైఫ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు ఎలా ఉందో ఇప్పుడు దాదాపు అంతే సైజ్‌లో ఆమె ఉంది. క‌త్రినా అందం ఇప్ప‌ట‌కీ చెక్కు చెద‌ర్లేదు. ఇంత సుదీర్ఘ‌కాలంగా బాలీవుడ్‌లో కెరీర్ కొనసాగించ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఇక ఆమె తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది. బాలీవుడ్ లో ఎన్నో సక్సెస్ పుల్ సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసింది. విక్టరీ వెంకటేష్ తో కలిసి మల్లీశ్వరి సినిమా చేసింది. అటు నందమూరి నట సింహం బాలయ్యతో కలిసి అల్లరి పిడుగులో నటించింది.

ఆమె మల్లీశ్వరి సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ సినిమాకు కె విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించాడు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ మూవీని నిర్మించింది. ఈ సినిమా లవ్ కమ్ రివేంజ్ స్టోరీతో తెరకెక్కింది. బ్యాంకు ఎంప్లాయిగా వెంకటేష్.. మీర్జాపూర్ యువరాణిలా కత్రినా కైఫ్ అద్భుతంగా నటించారు. చక్కటి కామెడీతో అదరగొట్టారు. అటు కోటా శ్రీనివాసరావు విలనిజం సినిమాకు మరో అసెట్ గా మారింది. మొత్తంగా ఈ సినిమా చక్కటి విజయం సాధించింది.

ఈ సినిమాలో న‌టించినందుకు గాను క‌త్రీనాకు అప్ప‌ట్లోనే 70 ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ ఇచ్చార‌ట‌. ముందు ఆమెతో అంత‌క‌న్నా త‌క్కువ రెమ్యున‌రేష‌న్ మాట్లాడుకున్నాక ఆ త‌ర్వాత ఆమె మ‌రింత డిమాండ్ చేయ‌డంతో పాటు ఇక్క‌డ హోట‌ల్ బిల్స్ అన్ని క‌ట్టాల‌ని లేకుంటే షూటింగ్‌కు రాన‌ని చెప్పి ముంబై చెక్కేసింద‌ట‌. మ‌ళ్లీ సినిమా యూనిట్ ఆమెతో చ‌ర్చించి అప్పుడు రెమ్యున‌రేష‌న్ పెంచితే కానీ క‌త్రీనా తిరిగి షూటింగ్‌కు రాలేద‌న్న టాక్ ఉంది. ఈ విషయాన్ని నిర్మాత దగ్గుబాటి సురేష్ స్వయంగా పలుమార్లు చెప్పాడు. మొత్తానికి బ్లాక్మెయిల్ చేసి మరీ రెమ్యునరేష్ పెంచుకుంది కత్రీనా..

కత్రీనా తెలుగు హీరో విజయ్‌ దేవరకొండతో కలిసి ఓ సినిమా చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్‌ – పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘లైగర్‌ ’ చిత్రంలో నటిస్తున్నారు. అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు కొరటాల శివతో ఒక చిత్రం కాగా మరొకటి శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్‌ నటించనున్నాడు.

ఇందులో ఒకటి పాన్‌ ఇండియా చిత్రంగా భారీస్థాయిలో తెరకెక్కనున్న చిత్రంలో కత్రీనా – విజయ్‌తో కలిసి నటించనుందనే వార్తలు వస్తున్నాయి. కత్రీనా ప్రస్తుతం ఆమె తమిళంలో శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వంలో ‘మేరీ క్రిస్మస్‌’ చిత్రంలో విజయ్‌ సేతుపతి సరసన నటిస్తోంది. ఇవి కాకుండా హిందీలో ఇషాన్‌ ఖట్టర్‌, సిద్ధాంత్‌ చతుర్వేదిలతో కలిసి ‘ఫోన్‌ బూత్‌’లో నటిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news