Moviesమెగాస్టార్ 153కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది... డీటైల్స్ ఇవే..!

మెగాస్టార్ 153కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది… డీటైల్స్ ఇవే..!

మెగాస్టార్ చిరంజీవి ఎనిమిది నెల‌ల గ్యాప్ త‌ర్వాత ఆచార్య సినిమా షూటింగ్‌లో పాల్గొన‌బోతున్నాడు. క‌రోనా వ‌ల్ల ఆచార్య సినిమా షూటింగ్ ఆగిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే వేస‌వికి ఆచార్య‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చేలా ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి కాస్త అటూ ఇటూగా ఆచార్య‌కు గుమ్మ‌డి కాయ కొట్టేస్తారు. ఆచార్య కంప్లీట్ అయిన వెంట‌నే చిరు త‌న 153వ ప్రాజెక్టును కూడా ప‌ట్టాలెక్కించ‌య‌నున్నారు.

 

కోలీవుడ్ హిట్ మాస్ మ‌సాలా వేదాళం రీమేక్‌లో చిరు న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అజిత్ హీరోగా ద‌రువు శివ ద‌ర్శ‌క‌త్వంలో  ఈ మాస్ మ‌సాలా మూవీ తెర‌కెక్కింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ రీమేక్ వ‌ర్క్‌పై గ‌త ఆరేడు నెల‌లుగా మెహ‌ర్ ర‌మేష్ వ‌ర్క్ చేస్తున్నాడు. చిరు సూచించిన మార్పులు కూడా ఓకే అయ్యాయ‌ట‌.

 

ఇక వేదాళం రీమేక్‌ను ప్రారంభించేందుకు జ‌న‌వ‌రి 18న ముహూర్తంగా ఫిక్స్ చేశార‌ట‌. ఈ సినిమాను ఆచార్య కంప్లీట్ అయిన వెంట‌నే ప‌ట్టాలెక్కించేందుకు రెడీగా ఉండాల‌ని చిరు ర‌మేష్‌కు సూచించాడ‌ట‌. ఇక ప్ర‌స్తుతం న‌టీన‌టులు, లొకేష‌న్ల ఎంపిక‌లో మెహ‌ర్ బిజీబిజీగా ఉన్నార‌ని తెలుస్తోంది. ఆచార్య వ‌చ్చిన వెంట‌నే పెద్దగా గ్యాప్ లేకుండానే వేదాళం రీమేక్‌తో చిరు వ‌చ్చే యేడాదే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news