Newsవిజ‌య‌వాడ  హ‌త్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు... ఎవ‌రి గొంతు వాళ్లే...

విజ‌య‌వాడ  హ‌త్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు… ఎవ‌రి గొంతు వాళ్లే కోసుకున్నాం

విజ‌య‌వాడ‌లో క‌ల‌క‌లం రేపిన ప్రేమోన్మాది హ‌త్య కేసు ఉదంతంలో ట్విస్టుల మీద ట్విస్టులు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇంజ‌నీరింగ్ చ‌దువుతోన్న దివ్య‌ను స్వామి అనే వ్య‌క్తి హ‌త్య చేసిన‌ట్టు వార్త‌లు వెలువ‌డ్డాయి. ఇంజ‌నీరింగ్ చ‌దువుతోన్న త‌మ అమ్మాయి ఓ పెయింట‌ర్‌ను ప్రేమించ‌డం ఇష్టం లేకే త‌ల్లిదండ్రులు వార్నింగ్ ఇచ్చార‌ని ముందు అనుకున్నారు. అయితే ఇప్ప‌టికే దివ్య‌ను స్వామి పెళ్లి చేసుకున్నాడ‌న్న‌ది త‌ర్వాత తేలింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

 

బాధితురాలి సోదరుడు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. స్వామి తమకు చిన్నప్పటి నుంచి తెలుస‌ని… వారిద్ద‌రు మంచి స్నేహితుల‌ని చెప్పాడు. ఇక అంద‌రూ దివ్య‌ను స్వామి గొంతు కోసి చంపేశాడ‌ని ఫిక్స్ అయిన టైంలో ఇప్పుడు మ‌రో ట్విస్ట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దివ్య‌ను తాను చంప‌లేద‌ని స్వామి చెపుతున్నాడు. ఎవ‌రి గొంతు వాళ్లే కోసుకున్నామ‌ని.. ఇద్ద‌రం కలిసి ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని అనుకున్నామ‌ని చెప్పాడు.

 

పెళ్లి త‌ర్వాత దివ్య త‌ల్లిదండ్రులు త‌మ‌ను విడ‌దీశార‌ని.. దివ్య పెళ్లి చేసుకోవాలని అడగగా తాను మరోసారి ఆలోచించుకోమ‌ని తాను అన్న‌ట్టు చెప్పాడు ఇద్ద‌రం గొంతు కోసుకున్నాక స్పృహ త‌ప్పి ప‌డిపోయామ‌ని.. ఆ త‌ర్వాత త‌న చేయి ఎవ‌రు కోశారో త‌న‌కు తెలియ‌ద‌ని స్వామి చెపుతున్నాడు. దీంతో ఈ మ‌ర్డ‌ర్ కేసులో ఇంకెన్ని కొత్త విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news