Politicsపెళ్లికి వెళ్లిన బాలిక‌పై అడ‌విలో ఏడుగురు గ్యాంగ్‌రేప్‌... రాత్రంతా ఘోరంగా హింసించి...!

పెళ్లికి వెళ్లిన బాలిక‌పై అడ‌విలో ఏడుగురు గ్యాంగ్‌రేప్‌… రాత్రంతా ఘోరంగా హింసించి…!

దేశం అంతా మ‌హిళ‌ల‌పై జ‌రుగుతోన్న అత్యాచారాల‌కు నిర‌స‌న‌లు తెలుపుతుంటే మ‌రోవైపు మృగాళ్లు మాత్రం రెచ్చిపోతున్నారు. ప్ర‌తి రోజూ దేశంలో ఏదో ఒక మూల మ‌హిళ‌లు అత్యాచారాల‌కు గుర‌వుతూనే ఉన్నారు. తాజాగా ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లో మాన‌వ మృగాలు రెచ్చిపోయాయి. ఓ పెళ్లికి వెళ్లి వ‌స్తోన్న ఓ బాలిక‌పై ఏకంగా ఏడుగురు గ్యాంగ్ రేప్ చేశారు. ముందుగా ఇద్ద‌రు వ్య‌క్తులు ఆ బాలిక‌ను ప‌క్క‌నే ఉన్న అడ‌విలోకి తీసుకువెళ్లారు. ఆ త‌ర్వాత మ‌రో ఐదుగురిని పిలిపించుకుని మొత్తం ఏడుగురు క‌లిసి రాత్రంతా ఆమెను తీవ్రంగా హింసిస్తూ లైంగీక దాడి చేశారు.

3 teens booked for raping minor girl in MP's Khajuraho | India News | Zee  News

ఈ దారుణమైన ఘటన గత జూలైలో కొండగావ్ జిల్లాలోని ఓ గ్రామంలో జరగగా ఆల‌స్యంగా ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది. జూలైలో బాలిక త‌న స్నేహితుడితో క‌లిసి పెళ్లికి వెళ్లింది. పెళ్ల‌య్యాక ఇంటికి వ‌స్తుండ‌గా అట‌వీ ప్రాంతంలో ఇద్ద‌రు వ్య‌క్తులు బాలిక స్నేహితుడిని కొట్టి ఆమెను అడ‌విలోకి తీసుకువెళ్లారు. అక్క‌డ మొత్తం ఏడుగురు వ్య‌క్తులు క‌లిసి ఘోరంగా రేప్ చేశారు. ఉద‌యం ఆమెను వ‌దిలేయ‌గా ఇంటికి వ‌చ్చిన బాధిత బాలిక అవ‌మాన భారంతో ఆత్మ‌హత్య చేసుకుంది.

30 men raped minor girl for two years in Kerala, father, other two held

బాధిత బాలిక స్నేహితుడు ఇచ్చిన స‌మాచారం ఆధారంగా పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోలేదు. అయితే త‌న కుమార్తెకు జ‌రిగిన అన్యాయంపై ఆమె తండ్రి అక్టోబ‌ర్ 6న ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌డంతో ఈ విష‌యం మీడియాలో హైలెట్ అయ్యింది. అప్పుడు ఈ ఘోరంపై రాష్ట్ర వ్యాప్తంగా క‌ద‌లిక రావ‌డంతో రంగంలోకి దిగిన పోలీసులు ద‌ర్యాప్తు చేయ‌డంతో పాటు ఐదుగురిని అరెస్టు చేశారు. మ‌రో ఇద్ద‌రు ప‌రారీలో ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news