Moviesఎన్టీఆర్ - ప్ర‌భాస్ మ‌ధ్యలో క్రేజీ డైరెక్ట‌ర్‌...!

ఎన్టీఆర్ – ప్ర‌భాస్ మ‌ధ్యలో క్రేజీ డైరెక్ట‌ర్‌…!

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ వ‌రుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు ఓకే చేసుకుంటూ పోతున్నాడు. బాహుబలి 1, 2, సాహో సినిమాల త‌ర్వాత వ‌రుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న రాధే శ్యామ్‌, ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్ సినిమాల‌కు క‌మిట్ అయ్యాడు. ఇక రాధే శ్యామ్ త‌ర్వాత వైజ‌యంతీ మూవీస్ నిర్మించే నాగ్ అశ్విన్ ప్రాజెక్టులో న‌టించ‌నున్నాడు.

 

ఈ మూడు కూడా క్రేజీ ప్రాజెక్టులే.. పాన్ ఇండియా రేంజ్‌లో తెర‌కెక్క‌నున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూడు సినిమాల త‌ర్వాత ప్ర‌భాస్ మ‌ళ్లీ త‌న హోం బ్యాన‌ర్ అయిన యూవీ క్రియేష‌న్స్‌లోనే ఓ సినిమా చేయ‌నున్నాడు. ఈ సినిమాకు కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ట‌. ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమాను చేస్తున్న ప్రశాంత్ నీల్ మ‌ధ్య‌లో మైత్రీ మూవీస్ బ్యాన‌ర్లో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాకు క‌మిట్ అయ్యాడు.

 

ఎన్టీఆర్ ప్ర‌స్తుతం చేస్తోన్న ఆర్ ఆర్ ఆర్ త‌ర్వాత త్రివిక్ర‌మ్ సినిమా త‌ర్వాత ఈ కాంబినేష‌న్లో సినిమా ఉండే ఛాన్సులు ఉన్నాయి. అయితే అదే టైంకు ప్ర‌భాస్ ఫ్రీ అయితే ప్ర‌శాంత్ నీల్ ముందుగా ఎన్టీఆర్ సినిమా చేస్తాడా ?  ప్ర‌భాస్ సినిమా చేస్తాడా ? అన్న‌దానిపై ఈ రెండు బ్యాన‌ర్ల‌లోనూ సందిగ్ధ‌త ఉంది. అటు ప్ర‌భాస్‌, ఇటు ఎన్టీఆర్ సినిమాలు స‌రైన టైంకు కంప్లీట్ అయితేనే ఈ ప్రాజెక్టులు అనుకున్న టైంకు ప‌ట్టాలెక్కుతాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news