Moviesఆ టాలీవుడ్ నటుడి ఇంట్లో విషాదం

ఆ టాలీవుడ్ నటుడి ఇంట్లో విషాదం

టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత‌, సీనియ‌ర్ న‌టుడు అశోక్ కుమార్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అశోక్ కుమార్ మాతృమూర్తి కె.వసుంధరాదేవి (88) సోమవారం మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న ఆమె చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. దీంతో అశోక్ కుమార్‌ ను సినీ ప్రముఖులు పరామర్శించారు. అశోక్ కుమార్ సీనియ‌ర్ న‌టుడిగా టాలీవుడ్‌లో సీనియ‌ర్ హీరోలు అంద‌రికి ఎంతో సుప‌రిచితులు.

 

ఆయ‌న నిర్మాత‌గా రక్త తిలకం – ధృవ నక్షత్రం – చెవిలో పువ్వు – ప్రేమంటే ఇదేరా – ఈశ్వర్ – జయదేవ్ వంటి హిట్ సినిమాల‌ను నిర్మించారు. ఇక ఆయ‌న నిర్మాత‌గానే కాకుండా నటుడిగా భారత్ బంధ్ సినిమాతో తెరంగేట్రం చేసాడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో ఓవర్ నైట్ నటుడిగా పాపులర్ అయ్యాడు. ఇక ట‌క్కరిదొంగ‌తో పాటు ప‌లు సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టించాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news