Newsటీడీపీలో విషాదం.. పులివెందుల సీనియ‌ర్ నేత మృతి

టీడీపీలో విషాదం.. పులివెందుల సీనియ‌ర్ నేత మృతి

క‌డ‌ప జిల్లా పులివెందుల టీడీపీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, అటవీశాఖ మాజీ డైరెక్టర్ మారుతీ వరప్రసాద్ మరణించారు. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న ఆయ‌న ఈ రోజు తుదిశ్వాస విడిచారు. దీంతో పులివెందుల పార్టీ నేత‌లు షాక్‌లో మునిగిపోయారు. వ‌ర‌ప్ర‌సాద్ మృతిపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ సంతాపం వ్య‌క్తం చేశారు. లోకేష్ ట్విట్ట‌ర్ వేదిక‌గా సంతాపం కూడా వ్య‌క్తం చేశారు.

ప్ర‌సాద్ గారి ఆకస్మిక మరణం పార్టీకి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడుని ప్రార్థిస్తున్నాన‌ని లోకేష్ త‌న సంతాపంలో పేర్కొన్నారు. ఇక వ‌ర‌ప్ర‌సాద్ స్థానికంగా పార్టీ కోసం ఎంతో కృషి చేశారు. ఆయ‌న్ను పార్టీ మారాల‌ని గ‌తంలో ఎంతో మంది ఎన్నో ఒత్తిళ్లు చేసినా వాటిని త‌ట్టుకుని మ‌రీ ఆయ‌న స్తానికంగా పార్టీ ప‌టిష్ట‌త కోసం కృషి చేశారు. వ‌ర‌ప్ర‌సాద్ మృతిప‌ట్ల ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాధ్ రెడ్డి, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి సంతాపం తెలిపారు.

కాగా వరప్రసాద్ 2019 పులివెందుల అసెంబ్లీ టిక్కెట్టు కోసం ప్రయత్నించారని అప్పట్లో ప్రచారం జరిగింది. 2019 ఎన్నికల్లో పులివెందుల టిక్కెట్ ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డికి ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. సతీష్ కుమార్ రెడ్డి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతిలో ఘోర ఓటమి చవిచూశారు. ఆ తరువాత సతీష్ కుమార్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news