Moviesజ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మ‌ర‌ణానికి ముందు ఏం జ‌రిగిందంటే...!

జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మ‌ర‌ణానికి ముందు ఏం జ‌రిగిందంటే…!

ప్ర‌ముఖ టాలీవుడ్ న‌టుడు, టాలీవుడ్ సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్, విల‌న్‌గా రాయ‌సీమ యాస‌తో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌స్సులు గెలుచుకున్న జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి ( 74) ఇటీవ‌ల ఆక‌స్మాత్తుగా మృతి చెందారు. ఆయ‌న అనారోగ్యానికి కూడా గురైన‌ట్టు ఎక్క‌డా వార్త‌లు రాలేదు. అయినా ఎలా చిన‌పోయాడో ? ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట‌డం లేదు. అయితే ఆయ‌న చ‌నిపోవ‌డానికి ముందు ఏం జ‌రిగింది ? అన్న విష‌యాన్ని ఆయ‌న భార్య రాజ్య‌ల‌క్ష్మీ మీడియాకు వెల్లడించారు.

Remembering Jaya Prakash Reddy: 5 Telugu comedy scenes that brought out his  best | The News Minute

ఆయ‌న చ‌నిపోయిన రోజు జేపీ ఉదయం 3.30 గంటలకే నిద్రలేచార‌ట‌. త‌న‌కు ఇబ్బందిగా ఉంద‌ని కూడా చెప్ప‌లేద‌ట‌. లేచిన కాసేపటికే పిల్లలతో మాట్లాడాలని అన‌డంతో ఉద‌యం 6 గంట‌ల‌కు మాట్లాడ‌దామ‌ని తాను అన్న‌ట్టు భార్య చెప్పారు. ఆ త‌ర్వాత బాత్‌రూమ్‌కు వెళ్లి అక్క‌డే క‌ళ్లు తేలేసి క‌నిపించార‌ని. వెంట‌నే డాక్ట‌ర్‌ను పిలిపించి ప‌ల్స్ చూడ‌మ‌ని చెప్ప‌గా ఆయ‌న చనిపోయాడ‌ని చెప్పార‌ని ఆమె తెలిపారు. ఇదంతా ఐదు నిమిషాల్లోనే జ‌రిగింద‌ని కూడా భార్య రాజ్య‌ల‌క్ష్మి భోరున విల‌పిస్తూ చెప్పారు.

Jaya Prakash Reddy dies at 74: Telugu film industry mourns demise of  versatile actor | Entertainment News,The Indian Express

కాగా జేపీ వారం రోజుల నుంచే కాస్త అస్వ‌స్థ‌త‌తో ఉంటున్నార‌ని.. షుగర్ కూడా డౌన్ అయ్యిందని.. కొంచెం నీరసంగా కనిపించారని తెలిపారు. అంతకుముందు గతంలోనే ఆయన గుండెకు వైద్యులు స్టంట్ వేశారని ఆమె చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news