Moviesఇండ‌స్ట్రీలో ఈ టాప్ హీరోలంతా డ్ర‌గ్స్‌లో మునిగేవాళ్లే... హీరోయిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఇండ‌స్ట్రీలో ఈ టాప్ హీరోలంతా డ్ర‌గ్స్‌లో మునిగేవాళ్లే… హీరోయిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులోకి ఇప్పుడు కొత్త‌గా డ్ర‌గ్స్ ఇష్యూ కూడా వ‌చ్చింది. సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తి సుశాంత్‌కు డ్ర‌గ్స్ తీసుకునే అల‌వాటు ఉంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఇక అత‌డికి ప్ర‌తి రోజు మ‌ద్యం సేవించే అల‌వాటు ఉంద‌ని కూడా ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక రియా చ‌క్ర‌వ‌ర్తి నిషేదిత డ్ర‌గ్స్ కొనుగోలు విష‌యాల‌పై డీల‌ర్ల‌తో చ‌ర్చించిన చాట్ మెసేజ్ కూడా డిలీట్ చేసింద‌ని.. అయితే ఈడీ అధికారులు ఆ మెసేజ్‌లు తిరిగి పొందార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి.

Kangana Ranaut | BoF 500 | The People Shaping the Global Fashion Industry

ఇదిలా ఉంటే రియాకు డ్ర‌గ్స్‌తో సంబంధం ఉంద‌ని నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ కేసు నమోదు చేసిందని తెలుస్తోంది. దీనిపై స్పందించిన బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ బాలీవుడ్ చీక‌టి కోణాల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. బాలీవుడ్‌లో దాదాపు 99 శాతం మంది డ్ర‌గ్స్ నీళ్ల‌లాగే వాడేస్తార‌ని.. ఇండ‌స్ట్రీలో బ‌తికేవాళ్ల‌లో ఎవ‌రో ఒక‌రో ఇద్ద‌రో మిన‌హా టాప్ హీరోల‌తో స‌హా అంద‌రూ డ్ర‌గ్స్ తీసుకుంటార‌ని ఆమె ఆరోపించింది. పార్టీ ఉంటే చాలు డ్ర‌గ్స్‌లోనే మునిగి తేలుతుంటార‌ని ఆమె చెప్పింది.

 

అవ‌స‌రం అయితే డ్ర‌గ్స్ విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ కు సహకారం అందిస్తానని.. మొత్తం గుట్టు బయటపెడతానని చెప్పింది. సుశాంత్ కు ఇండస్ట్రీ చీక‌టి ర‌హ‌స్యాలు తెలిసినందునే అత‌డు చ‌నిపోవాల్సి వ‌చ్చింద‌ని.. బాలీవుడ్‌లో స్టార్లు అంద‌రూ ఎక్కువుగా వాడే డ్ర‌గ్ కొకైన అంటూ ఆమె పేర్కొంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news