Gossipsదిల్‌రాజును ట్రోల్ చేస్తోన్న మ‌హేష్ ఫ్యాన్స్‌

దిల్‌రాజును ట్రోల్ చేస్తోన్న మ‌హేష్ ఫ్యాన్స్‌

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల మృతితో టాలీవుడ్ అంతా తీవ్ర శోక సంద్రంలో మునిగి పోయిన సంగతి తెలిసిందే. ప్రపంచ సినిమా చరిత్రలోనే ఏ మహిళ సాధించని రికార్డులు విజయనిర్మల సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె మృతితో ఘట్టమనేని అభిమానులు ఎంతో బాధ పడుతున్నారు. టాలీవుడ్ అంతా విజయనిర్మల మృతిచెందిన బాధలో ఉంటే… మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమా 50 రోజుల వేడుకను పోస్ట్పోన్ చేస్తున్నట్టు నిర్మాత దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేయడం మహేష్ బాబు అభిమానుల్లో కొందరికి ఆగ్రహాన్ని తెప్పించింది.

మహేష్ బాబు హీరోగా ముగ్గురు అగ్ర నిర్మాతలు నిర్మించిన మహర్షి సినిమా 211 కేంద్రాల్లో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 50 రోజుల వేడుకలు చేయాలని నిర్ణయించారు. అంతలోనే విజయనిర్మల మృతితో ఈ ప్రోగ్రాంను పోస్ట్ ఫోన్ చేస్తున్నట్టు వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. ఇది కొంత మంది మహేష్ బాబు అభిమానులకు నచ్చలేదు. మహేష్ బాబు కుటుంబం ఎంతో విషాదంలో ఉంటే ఈ కార్యక్రమాన్ని క్యాన్సిల్‌ చేయకుండా పోస్ట్ ఫోన్ చేయటం ఏంటని ? … సూపర్ స్టార్ కృష్ణ ఎంతో బాధతో ఉన్నారని… ఆయన అలాంటి బాధలో ఉంటే తాము ఎలా ? సంబరాలు చేసుకుంటామని కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.

దిల్ రాజు టీం కావాల‌ని కాక‌పోయినా… పొర‌పాటును ఈ పోస్ట్ పెట్టి ఉండ‌వ‌చ్చు. అయితే మ‌హేష్ అభిమానులు మాత్రం రాజును టార్గెట్గా చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌హేష్ తీవ్ర బాధ‌లో ఉన్న త‌న తండ్రిని ఓదార్చ‌డానికే కొద్ది రోజుల టైం ప‌డుతుంద‌ని… ఈ లోగా ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ చేయాలి క‌దా ? అని అంటున్నారు. విజ‌య‌నిర్మ‌ల కార్య‌క్ర‌మాలు కంప్లీట్ అయ్యేందుకు మ‌రో ప‌దిహేనే రోజుల టైం పడుతుంది. అప్ప‌ట‌కి మ‌హ‌ర్షి గురించి మాట్లాడుకునే వారు ఉండ‌రు… అప్పుడు 50 రోజుల వేడుక చేసినా యూజ్ ఉండ‌దు ? క‌దా ? అని వారు అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news