Gossipsఅప్పుడే ప్రయోగాలు చేస్తున్నా ఫిదా పోరీ..!

అప్పుడే ప్రయోగాలు చేస్తున్నా ఫిదా పోరీ..!

టాలీవుడ్ లో ఫిదా సినిమాతో తెలుగు రాష్ట్ర ప్రజలను ఫిదా చేసిన మాలీవుడ్ బ్యూటీ సాయి పల్లవి. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన సాయి పల్లవి నటన కూడా చాలా నేచురల్ గా కనబరుస్తుంది. సాయి పల్లవి కథలను బట్టి సినిమాలు ఎంచుకుంటుందని..అందుకే ఆమె నటించిన సినిమాలు మంచి విజయాలు అందుకుంటున్నాయని ఫిలిమ్ వర్గాల్లో టాక్. తాజాగా సక్సెస్ ఫుల్ మూవీ ‘నీదీ నాదీ ఒకే కథ’ దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన తారాగణంగా నిజ జీవిత సంఘటనల తో విరాట పర్వం 1992 మూవీ రూపొందనుంది.

ఈ చిత్రంలో సాయి పల్లవి డీ గ్లామరైజ్డ్ రోల్ లో నటిస్తున్నారు. గతంలో ఇలాంటి ప్రయోగాలు చేసిన హీరోయిన్లు చాలా తక్కువ మందే అని చెప్పొచ్చు..అయినా వారు మంచి సక్సెస్ అందుకున్నారు. బాహుబలి లో మొదటి పార్ట్ లో అనుష్క డి గ్లామర్ రోల్ పోషించి..బాహుబలి 2 లో మహరాణిలా కనిపించింది.

విరాట పర్వం 1992 మూవీ లో హీరోయిన్ సాయి పల్లవి మేకప్ లేకుండా నటించడం విశేషం. లవ్ ఫెయిల్యూర్ తో డిప్రెషన్ లో నక్సలైట్ గా మారే పేదింటి అమ్మాయి గా సాయి పల్లవి , ఆ విలేజ్ లోనే పొలిటికల్ లీడర్ గా రానా నటిస్తున్నారు.

సుధాకర్ చెరుకూరి, సురేష్ బాబు నిర్మాణ సారథ్యం లో రూపొందనున్న విరాట పర్వం 1992 మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ జూన్ నెలలో ప్రారంభమవుతుంది. వరంగల్, కరీం నగర్, సిద్ధిపేట తదితర ప్రాంతాల్లో ఈ షూటింగ్ జరుగుతుంది. టబు, ప్రియమణి, జరీనా వహాబ్, ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news