Gossipsమరోసారి మెగా వలలో పడ్డ రష్మిక..

మరోసారి మెగా వలలో పడ్డ రష్మిక..

ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న తెలుగులో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఛలో తర్వాత గీతా గోవిందం అమ్మడికి మరింత క్రేజ్ వచ్చేలా చేసింది. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన గీతా గోవిందం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చింది. ఆ సినిమా ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. ఇక ఆ సినిమా తర్వాత దేవదాస్ సినిమాలో నటించింది రష్మిక. తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ గా కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది.

తమిళ హీరో కార్తి సరసన రష్మిక సినిమా చేస్తుందట. ఇదిలాఉంటే మరోసారి గీతా ఆర్ట్స్ లో రష్మిక సినిమా చేస్తుందని తెలుస్తుంది. గీతాగోవిందం హిట్ అవడానికి విజయ్ తో పాటుగా రష్మిక కంట్రిబ్యూషన్ కూడా ఉంది. అందుకే ఆ లక్కీ హీరోయిన్ తోనే గీతా ఆర్ట్స్ సినిమా ఉంటుందట. మారుతి డైరక్షన్ లో తెరకెక్కించబడే ఈ సినిమాలో మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ నటిస్తాడని తెలుస్తుంది. తేజూతో రష్మిక రొమాన్స్ చేస్తుందన్నమాట. మారుతి గీతా ఆర్ట్స్ లో వచ్చిన భలే భలే మగాడివోయ్ సూపర్ హిట్ అయ్యింది.

ఇప్పుడు ఆ కాంబినేషన్ రిపీట్ చేస్తూ ఈసారి సాయి ధరం తేజ్ తో సినిమా చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం రష్మిక డియర్ కామ్రేడ్ సినిమా చేస్తుండగా.. తేజూ చిత్రలహరి సినిమాలో నటిస్తున్నాడు. కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై సాయి ధరం తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news