Gossipsబ్రేకింగ్ న్యూస్: పవన్ కళ్యాణ్ జనసేన ప్రస్థానం రేపే!!

బ్రేకింగ్ న్యూస్: పవన్ కళ్యాణ్ జనసేన ప్రస్థానం రేపే!!

పవన్ కళ్యాణ్ అభిమాని వినోద్ మృతి సందర్భంగా వినోద్ కుటుంబసభ్యులని పరామర్శించేందుకు తిరుపతి వెళ్లిన పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం కాలినడకన వెళ్లి దైవ దర్శనం చేసుకున్నాడు. మాకు అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు నిన్న సాయంత్రం నుండి..తన రూమ్ లోనే వేరు వేరు గా తన అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలతో భవిష్యత్తు ప్రణాళిక.. జనసేన భవిష్యత్తు గురించి చర్చించుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ రోజు కూడా ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. రేపు సాయంత్రం ఇందిరా గ్రౌండ్(ఇంకా మైదానం ఫైనల్ కావలసి ఉంది) నందు పెద్ద ఎత్తున బహిరంగ సభకి ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి.

అభిమానులతో చర్చలే చర్చలు : నిన్న సాయంత్రం దైవ దర్శనం ముగిసిన తర్వాత… ఒకొక్కరుగా అభిమానులు పవన్ బస చేసిన రూమ్ వద్దకి చేరుకొని తమ తమ అభిప్రాయాలు తెలియజేయటం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితులు… ప్రత్యేక హోదా పై జనసేన పోరాట ప్రణాళిక గురించి… జనసేన కార్యవర్గం నియామకాల గురించి… 2019 ఎన్నికల సమయం కల్లా జనసేన పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేయడం గురించి.. ఇంకా అభిమానుల మధ్య వచ్చే విభేదాలపై మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది.

రేపే బహిరంగ సభ : రేపు సాయంత్రం తిరుపతి మనకి ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు ఇందిరా మైదానం లో పెద్ద ఎత్తున బహిరంగ సభని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మీటింగ్ లో చర్చకి రాబోయే అంశాలు: మెగా అభిమానుల మధ్య విబేధాలు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు, ప్రత్యేకహోదాపై జనసేన అభిప్రాయం, జనసేన భవిష్యత్తు ప్రణాళిక.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news