Movies"దమ్ము ఉన్నోడు ఇప్పుడు మాట్లాడండి రా"..ఒక్కే ఒక్క పోస్ట్ తో బాలీవుడ్...

“దమ్ము ఉన్నోడు ఇప్పుడు మాట్లాడండి రా”..ఒక్కే ఒక్క పోస్ట్ తో బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఐశ్వర్య రాయ్..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్ ఐశ్వర్యరాయ్ హీరో అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. వీళ్ళకి సంబంధించిన ఈ వార్త ఎంతగా ట్రెండ్ అయిందో మనం చూసాం . అయితే వీళ్ళు విడాకులు తీసుకుంటున్నారు అనే వార్తలు వచ్చిన సరే ఎక్కడ కూడా ఈ జంట రియాక్ట్ అవ్వలేదు. కొన్ని సందర్భాలలో అభిషేక్ బచ్చన్ ఒక్కడే బాలీవుడ్ పార్టీస్ లో , పుణ్యక్షేత్రాలలో కనిపించడం ఈ విడాకుల రూమర్స్ కు ఇంకా ఎక్కువగా ఆజ్యం పోసినట్లయింది.

రీసెంట్గా అలాంటి వాటికి చెక్ పెడుతూ ఐశ్వర్యారాయ్ సెన్సేషనల్ పోస్ట్ షేర్ చేసింది. అభిషేక్ బచ్చన్ బర్త డే సందర్భంగా ఆమె ఆయనకు స్పెషల్ విషెస్ అందించింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీని ఐశ్వర్యరాయ్ పెట్టిన పోస్ట్ షేక్ చేస్తుంది. ” జన్మదిన శుభాకాంక్షలు మీరు ఎప్పుడు చాలా సంతోషంగా – హ్యాపీగా – ప్రశాంతంగా – ఆరోగ్యంగా ఉండాలి అని ..ఆ దేవుడు ఆశీర్వాదాలు ఎప్పుడూ మీకు ఉండాలి అని కోరుకుంటున్నాను “అంటూ భర్త కూతురుతో దిగిన ఫోటోను షేర్ చేసింది ఐశ్వర్యరాయ్ .

దీంతో ఒక్కసారిగా మళ్లీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ ల మధ్య రిలేషన్షిప్ వైరల్ అవుతుంది. అయితే దీని పట్ల ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ల ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇన్నాళ్లు ఏవేవో మాట్లాడారు ..దమ్మున్నోళ్ళు ఇప్పుడు మాట్లాడండి ఐశ్వర్య అభిషేక్ విడిపోవాలనుకుంటున్నారా..? ఈ ఫోటోనే వాళ్ళకి సాక్ష్యం “అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. చూద్దాం మరి దీని పై ఇంకెన్ని ట్రోల్స్ మీమ్‌స్ వస్తాయో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news