Newsబిగ్ బాస్ జగత్ కంత్రీ ప్లాన్.. లాస్ట్ మినిట్ లో విన్నర్...

బిగ్ బాస్ జగత్ కంత్రీ ప్లాన్.. లాస్ట్ మినిట్ లో విన్నర్ నే మార్చేశాడుగా.. టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్..!?

బిగ్బాస్ సీజన్ సెవెన్ రోజు రోజుకి రసవత్తరంగా మారిపోతుంది . మరీ ముఖ్యంగా ఎవరు విన్నర్ అవుతారు.. ఎవరు రన్నర్ అవుతారు అనే విషయాలు చెప్పడం అస్సలు సాధ్యం కావడం లేదు. బిగ్ బాస్ తెలుగు సెవెన్ చివరి దశకు చేరుకున్న మూమెంట్లో గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో హౌస్ లో ఇక మిగిలింది ఏడంటే ఏడుగురు కంటెస్టెంట్స్ మాత్రమే . అర్జున్ ఫినాలే అస్తా గెలిచి డైరెక్ట్ గా ఫైనల్ కి వెళ్లిపోయాడు . ఇక మిగిలిన నలుగురు కుటుంబ సభ్యులు ఎవరా..? అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా చర్చలు మొదలయ్యాయి.

అయితే కచ్చితంగా ఫైనల్ లో ఇద్దరు లేడీస్ ఉంటారు అని ధీమా వ్యక్తం చేస్తున్న జనాలకు ఇది నిజంగా నిరాశ మిగిల్చే వార్తనే చెప్పాలి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను బట్టి బిగ్ బాస్ సీజన్ సెవెన్ టాప్ ఫైనల్ కంటెస్టెంట్ గా అర్జున్ – శివాజీ – ప్రశాంత్ – అమర్ – ప్రియాంక లను ఫిక్స్ చేయనున్నారట బిగ్బాస్ . ఓటింగ్ తో సంబంధం లేకుండా బిగ్బాస్ తనకు ఇష్టం వచ్చిన విధంగా వాళ్లను చూస్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది .

అంతేకాదు ఊహించని విధంగా ఓట్స్ కూడా తారుమారు అయిపోయాయి . మొన్నటి వరకు మూడో స్థానంలో ఉన్న యావర్ ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయాడు . మూడో స్థానంలో అమర్ సెటిల్ అయ్యాడు . కాగా ఫస్ట్ ప్లేస్ లో ప్రశాంత్ సెకండ్ ప్లేస్ లో శివాజీ థర్డ్ ప్లేస్ లో అమర్ ..నాలుగవ ప్లేస్ లో యావర్..ఐదవ ప్లేస్ లో అర్జున్.. ఆరవ ప్లేస్ లో ప్రియాంక .. ఏడవ ప్లేస్లో శోభ ఉన్నట్లు తెలుస్తుంది . అంతేకాదు 14వ వారం శోభను ఎలిమినేట్ చేయాలి. అయితే శోభాను ఎలిమినేట్ చేయకుండా యావర్ ని ఎలిమినేట్ చేసి మిడ్ వీక్ లో శోభాను ఎలిమినేట్ చేసే విధంగా బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నారట. అలా అయితే ఫైనల్ గా వెళ్లే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ శివాజీ – ప్రశాంత్ – అమర్ – ప్రియాంక – అర్జున్ అంటూ విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news