Newsప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరెత్త‌గానే కోపంతో ఊగిపోయిన రేణుదేశాయ్‌..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరెత్త‌గానే కోపంతో ఊగిపోయిన రేణుదేశాయ్‌..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బద్రి – జానీ సినిమాలలో కలిసి నటించిన పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ జానీ సినిమా టైంలోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొన్నేళ్లు పాటు సహజీవనం చేసి ఇద్దరు పిల్లలను కూడా క‌న్నారు. ఈ దంపతులకు ఆధ్యా – అఖీరానందన్ ఉన్న సంగతి తెలిసిందే. తర్వాత మనస్పర్ధల నేపథ్యంలో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత‌ పవన్ కళ్యాణ్ తీన్మార్ నటి అన్నా లెజ్నోవాను మరో పెళ్లి చేసుకున్నారు.

రేణు దేశాయ్ మాత్రం పూణేలో తన తల్లిదండ్రుల వద్ద ఉంటూ పిల్లలు బాధ్యత తీసుకొని వారిని పెంచుతుంది. అయితే రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ పోస్టులు పెడుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆమెను పవన్ కళ్యాణ్ అభిమానులు విసిగిస్తూ ఉంటే ఆమె పవన్ అభిమానులకు గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది. చాలా ఏళ్లుగా తెలుగు సినిమాకు దూరంగా ఉన్న ఆమె ఎఇన్నాళ్ల తర్వాత మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇస్తోంది.

ఆమె టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలత లవణం పాత్రలో కనిపిస్తోంది. ఇదిలా ఉంటే రేణుదేశాయ్‌కు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి మీ ఇంటర్వ్యూలలో పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నలు అడగవద్దని చెప్పండి అని పోస్ట్ పెట్టాడు. దానికి రేణు స్పందిస్తూ తాను ఆయనతో కలిసి 11 ఏళ్ళు ఉన్నాను.. ఆయన నా ఇద్దరి పిల్లలకు తండ్రి.. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలో లేదో అనేది పూర్తిగా నా ఇష్టం.. జనాలు ఇలాంటి పాలసీ తీసేయండి రిప్లే ఇచ్చింది.

సోష‌ల్ మీడియాలో ఏం చేయాలి ? అన్నది మేము మీకు చెబుతున్నామా.. మీరు ఎవరు నాకు చెప్పటానికి అని ఘాటుగా రిప్లై ఇచ్చింది. అంతేకాకుండా దీనికి సంబంధించి స్క్రీన్ షాట్ తీసి తన ఇష్టాలు షేర్ చేసింది. ఇప్పుడు ఈ కామెంట్ సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతుంది. రేణు మొత్తానికి ఆ నెటిజన్ కి చాలా ఘాటు రిప్లై ఇచ్చిందని ఒకటే చర్చ నడుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news