Moviesప‌వ‌న్ VS బ‌న్నీ వార్ కొత్త మ‌లుపు తిరిగిందిగా… భ‌గ్గుమంటోన్న ప‌వ‌న్...

ప‌వ‌న్ VS బ‌న్నీ వార్ కొత్త మ‌లుపు తిరిగిందిగా… భ‌గ్గుమంటోన్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య కోల్డ్ వార్ అయితే నడుస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ తన సినిమాలతో పవన్ సినిమాల రికార్డులను కూడా క్రాస్ చేయాలని పంతం వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మెగా పవన్ అభిమానులతో సంబంధం లేకుండా తనకంటూ సపరేట్గా ఒక ఆర్మీ క్రియేట్ చేసుకున్నారు. ఏఏ అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.

ఇక రుద్రమదేవి సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో పవన్ గురించి మాట్లాడాలని అభిమానులు కోరితే.. బన్నీ చెప్పను బ్రదర్ అని పవన్ అభిమానులకు మంట పెట్టేసాడు. అక్కడి నుంచి బన్నీ – పవన్ అభిమానుల మధ్య వార్‌ ఒక రేంజ్ లో నడుస్తోంది. పవన్ దీనిపై ఎప్పుడు స్పందించక పోయినా బన్నీ విషయంలో గుర్రుగా ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తో సినిమాలో నిర్మిస్తున్న మైత్రి సంస్థ.. ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య యుద్ధంలో నలిగిపోతున్నట్టు కనిపిస్తోంది.

బుధవారం పుష్ప 2 సినిమా ప్రి టీజర్ రిలీజ్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే ఈ రెండు ప్రాజెక్టులకు సమాన ప్రాధాన్యం ఇవ్వటంలో మైత్రి సంస్థ ఫెయిల్ అయినట్టే కనిపించింది. నిన్న ఉదయం నుంచి పుష్ప 2 గ్లింప్స్‌ కే ప్రాధాన్యం ఇచ్చింది. మైత్రి అసలు పవన్ సినిమా షూటింగ్ మొదలైంది అన్న విషయాన్ని ఏమాత్రం పట్టించుకోనట్టుగా కనిపించింది.

దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భ‌గ్గుమంటున్నారు. తమ అఫీషియల్ పేజీలో పుష్ప 2 గ్లింప్స్ పై ఏకంగా 10 పోస్టులు పెట్టిన మైత్రి సంస్థ.. కనీసం పవన్ సినిమా సెట్స్ మీదకు వచ్చిందని ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదని పవన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. పవన్ సినిమా మొదలైందని పోస్ట్ పెడితే బన్నీ కోపానికి గురికావాల్సి వస్తుందన్న భయంతోనే మైత్రి నిర్మాతలు వెనక్కు తగ్గారా అన్న చర్చలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనా ఒకేరోజు తమ బ్యానర్ లో వస్తున్న ఇద్దరు పెద్ద హీరోల సినిమాల అప్‌డేట్లకు సమానంగా ప్రయారిటీ ఇచ్చే విషయంలో మైత్రి మూవీ మేకర్స్ ఫెయిల్ అయినట్టే కనిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news