Movies"ఆ ముఖానికి అదే ఎక్కువ"..ఎన్టీఆర్ ఫేవరేట్ హీరోయిన్ అంత మాట అనేసింది...

“ఆ ముఖానికి అదే ఎక్కువ”..ఎన్టీఆర్ ఫేవరేట్ హీరోయిన్ అంత మాట అనేసింది ఏంటి..!!

సమీరా రెడ్డి .. ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో మూవీస్ లో నటించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కాగా మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ – చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో తెలుగులో స్క్రీన్ షేర్ చేసుకొని జనాలకు తన పేరుని గుర్తుండిపోయేలా చేసుకుంది ఈ సమీరా రెడ్డి . నరసింహుడు సినిమాలో ఎన్టీఆర్ తో ఆడి పాడి అలరించిన సమీరారెడ్డి ..ఆ టైంలో చేసిన హంగామా ఇప్పటికీ మర్చిపోలేము .

అంతేనా మెగాస్టార్ చిరంజీవితో కలిసి “జై చిరంజీవ” సినిమాలో మహ ముద్దొచ్చేస్తున్నావోయ్ అంటూ చిరంజీవితో పోటా పోటీగా డాన్సులు వేసిన తీరు ఇప్పటికే ఆశ్చర్యంగానే ఉంటుంది. అంతేనా చిరంజీవి సైతం సమీరా రెడ్డితో కాలు కదపలేకపోయాను అంటూ ఓపెన్ గానే చెప్పకు వచ్చాడు .ఆ టైంలో రాధా తో స్టెప్స్ వేసి ఎంజాయ్ చేశానని.. మళ్లీ అదే మూమెంట్ అదే ఫీలింగ్ అదే ఎంజాయ్మెంట్ సమీరా తో డ్యాన్స్ చేస్తుంటే వస్తుందంటూ ఓపెన్గానే చెప్పేశాడు. కాగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాక సినిమా ఇండస్ట్రీకి దూరమైన సమీరారెడ్డి .

రీసెంట్ గా తన పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంది. కెరియర్ స్టార్టింగ్ లో ఆడిషన్స్ వెళ్లే టైంలో తాను ఎంతలా ఇబ్బంది పడ్డానో.. ఫీల్ అయ్యాను అని చెప్పుకొచ్చింది . అదే టైంలో “టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఆఫర్ వచ్చినా తాను నిలదొక్కుకోలేకపోయానంటూ బాధపడింది. మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ రోల్ కోసం ఆడిషన్ చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్లానని ..అయితే ఆ టైంలో భయం రావడంతో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసానని.. ఆటోలో వస్తూ కూడా మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాను అంటూ గుక్క పట్టి ఏడ్చానని.. నా బతుకు ఇంతే నా ముఖానికి డెస్క్ జాబే నే ఎక్కువ అంటూ ఫీల్ అయిపోయానని “చెప్పకు వచ్చింది. కాగా ఆ తర్వాత మళ్లీ ధైర్యం చేసుకొని సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావడానికి ట్రై చేశానని ..ఆ తర్వాత దేవుడు చాలా సహాయపడ్డాడని ..హీరోయిన్ అయ్యానని చెప్పుకొచ్చింది . దీంతో ఎన్టీఆర్ ఫేవరెట్ హీరోయిన్గా చెప్పుకునే సమీరా రెడ్డి కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news