Moviesస్టోరీ వినకుండానే..అలా వైకుంఠపురం సినిమా ని మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో...

స్టోరీ వినకుండానే..అలా వైకుంఠపురం సినిమా ని మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అందాల ముద్దుగుమ్మ పూజ హెగ్డే హీరోయిన్గా నటించిన సినిమా.. అలా వైకుంఠపురం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంది. అల్లు అర్జున్ కెరీర్ లో చేసిన అన్ని సినిమాల్లోకి ఆయనలోని మాస్ – క్లాస్ – కామెడీ యాంగిల్స్ ని బయటపెట్టింది.

 

ఈ సినిమా రిలీజ్ అవుతున్న టైం లో బన్ని ఫ్యాన్స్ ఈ సినిమాపై పెట్టుకుని ఎక్స్పెక్టేషన్స్ ని టృఇపుల్ రేంజ్ లొ అందుకున్నాడు. ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ మన ఫోన్స్ ప్లే లిస్టులో మారుమ్రోగిపోతుంటాయి. కాగా ఈ సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మొదట హీరోయిన్గా తమన్నాను అనుకున్నారట. స్టోరీ చెప్పడానికి ఆమెను అప్రోచ్ అయిన టైంలో స్టొరీ వినకుండానే తమన్నా తను వేరే ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నానని .. నో చెప్పిందట .

ఇదే క్రమంలో ఈ సినిమాని మరో ఇద్దరు హీరోయిన్స్ కి చెప్పిన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ..ఫైనల్ గా పూజా హెగ్డేను సెలెక్ట్ చేసుకున్నారట త్రివిక్రమ్. ఏది ఏమైనా సరే త్రివిక్రమ్ – పూజ హెగ్డే కాంబో అంటే జనాలకు అదో తెలియని ఫీలింగ్..భలే లైక్ చేస్తూ ఉంటారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news