Moviesఅక్క ఊపేసింది..ఇప్పుడు చెల్లెలు వంతు..అందుకు అనసూయ ముద్దుల చెల్లి రెడీ..!?

అక్క ఊపేసింది..ఇప్పుడు చెల్లెలు వంతు..అందుకు అనసూయ ముద్దుల చెల్లి రెడీ..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్నాళ్లు బుల్లితెర ను ఓ రేంజ్ ఏలేసిన అక్క టైం అయిపోయింది. ఇక చెల్లి వంతు వచ్చింది అంటూ ట్రోల్ చేస్తున్నారు. మనకు తెలిసిందే బుల్లితెరపై ఉన్న స్టార్ యాంకర్లలో ఒకరు అనసూయ . న్యూస్ రీడర్ గా తన కెరియర్ ని ప్రారంభించిన అనసూయ ఆ తర్వాత జబర్దస్త్ గా తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ జబర్దస్త్ ను తన భుజాలపై ముందుకు తీసుకువెళ్లిన అనసూయ ..కొద్ది రోజుల క్రితమే జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసింది. దానికి కారణం ఏంటా అంటూ జనాలు బుర్ర పీక్కున్నారు.

అయితే అక్కడ బాడీ షేమింగ్ కామెంట్స్ తట్టుకోలేక బయటకు వచ్చేసానంటూ అనసూయ చెప్పుకోరావడం సంచలనంగా మారింది. అంతేకాదు అనసూయ జబర్దస్త్ నుండి ఏ ముహూర్తాన బయటపెట్టిందో.. అప్పటి నుంచి ఆమెకు బ్యాడ్ లక్ పక్కనే హ్యాండ్ బ్యాగ్ లో నడుస్తుంది. జబర్దస్త్ షో ఆపేసిన తర్వాత నుండి అనసూయ కెరియర్ డిజాస్టర్ గా మారింది. సినిమాల అవకాశాలు తగ్గిపోయాయి.. లేనిపోని కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేసి వివాదాల్లో ఇరుక్కుంటుంది. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అనసూయ సోషల్ మీడియాలో ఆంటీ అంటూ ఏ రేంజ్ లో ట్రోల్ చేశారో మనకు తెలిసిందే.

కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అనసూయ చెల్లెలు వైష్ణవి బుల్లితెరపై అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది . ఎస్ ప్రముఖ ఛానల్లో యాంకరింగ్ గా తన కెరీర్ ని ప్రారంభించబోతుందట అనసూయ చెల్లెలు వైష్ణవి. ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అంతేకాదు వైష్ణవి కొంచెం కలర్ తక్కువ చెప్పుకోవడానికి ..పెద్ద ఫిజిక్ కూడా కాదు అన్న కామెంట్స్ ఎక్కువుగా వినిపిస్తున్నాయి. మరి అలాంటి అమ్మాయి బుల్లితెరపై ఇంత టఫ్ కాంపిటీషన్ తట్టుకుంటుందా అనే డౌట్లు వస్తున్నాయి. మరి చూడాలి అనసూయ తన చెల్లి వైష్ణవి ఏ రేంజ్ లో జనాలను ఆకట్టుకుంటుందో.. అయితే ఇప్పటివరకు దీనిపై అనసూయ కానీ వైష్ణవి గాని అఫీషియల్ ప్రకటన చేయలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news