Moviesత్రివిక్రమ్ అలా చేసి తప్పు చేస్తున్నాడా..? మహేశ్ రేంజ్ ఏంటి నువ్వు...

త్రివిక్రమ్ అలా చేసి తప్పు చేస్తున్నాడా..? మహేశ్ రేంజ్ ఏంటి నువ్వు చేస్తుందేంటి..!

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మంచి మంచి స్టోరీలు చూస్ చేసుకుంటూ.. అద్భుతమైన కంటెంట్ ను జనాలో కి తీసుకువస్తూ.. తనదైన స్టైల్ లో నటిస్తున్నాడు ఈ హీరో. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాసరావు డైరెక్షన్లో శ్శంభ్ 28 అనే సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. కాగా ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ ని సెలెక్ట్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో మరికొన్ని పాత్రలని యాడ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మహేష్ బాబుకి బ్రదర్ గా ఓ యంగ్ హీరోని అనుకుంటున్నాడని వార్తలు వైరల్ అయ్యాయి . అంతేకాదు ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఆమెతోపాటు ఈ సినిమాలో మహేష్ బాబు మరదలిగా మరో యంగ్ బ్యూటీ కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది . ఇప్పటికే ఈ రోల్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ మలయాళీ బ్యూటీని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. కాగా రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఈ చిత్రంలో విలన్ గా త్రివిక్రమ్ మలయాళ ఇండస్ట్రీకి చెందిన మల్టీ టాలెంటెడ్ పర్సన్ ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఆయన ఎవరో కాదు మలయాల నటుడు రోషన్. ఈ మధ్యనే కోబ్రా సినిమాలో విలన్ గా చేసి తనదైన స్టైల్ లో మెప్పించిన ఈయనపై త్రివిక్రమ్ కళ్ళు పడట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్ రోల్ కోసం ఆయన్ని సంప్రదించినట్లు సమాచారం. కాగా మహేష్ రేంజ్ కి ఆయన సరిపోడు అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. మహేష్ తో సినిమా అంటే కచ్చితంగా ఓ రేంజ్ ఉండాలని అలాంటి నటులనే చూస్ చేసుకుంటే సినిమాకి మరింత ప్లస్ అవుతుందని.. నువ్వు రెమ్యూనరేషన్ కోసం కక్కుర్తి పడుతూ ..మహేష్ ఖాతాలో ఫ్లాప్ చేయడానికి చూడొద్దు,.. అంటూ త్రివిక్రమ్ పై కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు త్రివిక్రమ్ పై సీరియస్ అవుతున్నారు . మరి చూడాలి ఈ మాటలు త్రివిక్రమ్ వింటాడో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news