Moviesమెగా మేనల్లుడు బ్యాక్..యాక్సిడెంట్ తరువాత మొదటి సినిమాకు సైన్..ఆ క్రేజీ డైరెక్టర్...

మెగా మేనల్లుడు బ్యాక్..యాక్సిడెంట్ తరువాత మొదటి సినిమాకు సైన్..ఆ క్రేజీ డైరెక్టర్ తోనే..!!

మెగాస్టార్ మేనల్లుడు..సాయిధరమ్‌ తేజ్‌ కు వినాయక చవితి రోజున భారీ రోడు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జ్‌ నుంచి ఐకియా స్టోర్‌ వైపు బైక్ లో వెళ్తుండగా .. ఒక్కసారిగా స్కిడ్‌ అయి బైక్‌ పై నుంచి సాయిధరమ్‌ తేజ్‌ కొంద పడిపోయాడు. దీంతో ఆయన కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే స్థానికులు తేజ్‌ను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే అనంతరం అపోలో హాస్పిటల్‌లో సుమారు నెలరోజుల పాటు చికిత్స తీసుకున్న తేజ్‌ డిశ్చార్చ్‌ అయ్యారు. ఇన్ని రోజులు ఇంట్లోనే చికిత్స తీసుకున్న ఈ యంగ్‌ హీరో ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తుంది.

తాజా సమాచారం ప్రకారం సాయి ధరమ్‌ తేజ్‌ పూర్తిగా కోలుకుని ఓ సినిమాకు కూడా సైన్ చేసిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సన్నిహిత వర్గాల దగ్గర నుండి అందుతున్న సమాచారం మే రకు సాయి ధరమ్‌ తేజ్‌ డైరెక్టర్ మార్తి డైరెక్షన్ లో ఓ సినిమా తీయ్యబోతున్నాడట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే యాక్సిడెంట్ తరువాత సాయి బాగా తగ్గిపోయారట. ఆయనను కలిసిన వాళ్లు చెబుతున్న దాని ప్రకారం.. సాయి ఫస్ట్ మీద ఇప్పుడు చాలా సన్నగా కనిపిస్తున్నాడట. ఇక రీసెంట్ గా మెగా హీరోలతో సాయిధరమ్‌ తేజ్‌ తీసుకున్న ఫోటోలో కూడా మనకు అలాగే కనిపిస్తున్నారు.

సినీ ఇండస్ట్రీలోకి మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా అడుగు పెట్టిన సాయి ధరమ్ తేజ్ ..పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో హిట్ కోట్టారు. ఆయన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. రీసెంట్ గా ఆయన నటించిన ‘రీపబ్లిక్” అనే సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకునింది. కలెక్షన్ స్పరంగా ఫ్లాప్ అయినా.. ఆడియన్స్ కు మాత్రం రీచ్ అయ్యింది. ఇక మారుతి డైరెక్షన్ లో సాయి సినిమా షూటింగ్ జనువరి నుండి మొదలు కానున్నట్లు టాక్ వినిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news