Moviesమ‌హేష్ అత‌డు బ్లాక్ బ‌స్ట‌ర్‌.. అయినా నిర్మాత న‌ష్టాల‌కు అత‌డే కార‌ణ‌మా...!

మ‌హేష్ అత‌డు బ్లాక్ బ‌స్ట‌ర్‌.. అయినా నిర్మాత న‌ష్టాల‌కు అత‌డే కార‌ణ‌మా…!

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో అతడు ఎంత బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. 2005లో వ‌చ్చిన ఈ సినిమాలో మ‌హేష్ బాబు స‌ర‌స‌న త్రిష హీరోయిన్‌గా న‌టించింది. బ‌ల‌మైన క‌థ‌, స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాగా వ‌చ్చిన అత‌డు ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా పొందింది. పైగా జ‌య‌భేరీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ హీరో మాగంటి ముర‌ళీమోహ‌న్ ఈ సినిమాను నిర్మించారు.

అప్ప‌టికే త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్వ‌యంవ‌రంతో సినిమా ర‌చ‌యిత‌గా కెరీర్ స్టార్ట్ చేసి నువ్వే కావాలి – నువ్వు నాకు నచ్చావ్ – మల్లీశ్వరీ – మన్మధుడు లాంటి సూపర్ హిట్ సినిమాలకి కథ, మాటలు అందించి టాప్ రైట‌ర్‌గా దూసుకుపోతున్నాడు. ఆ టైంలోనే నువ్వే నువ్వే సినిమాతో మెగాఫోన్ ప‌ట్టి ద‌ర్శ‌కుడు అయ్యారు. ఆ త‌ర్వాత రెండో సినిమాకే త్రివిక్ర‌మ్‌కు మ‌హేష్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వ‌చ్చింది.

అప్ప‌టి వ‌ర‌కు మ‌హేష్‌ను ఎవ్వ‌రూ చూపించ‌ని ఓ కొత్త కోణంలో ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ చూపించారు. ఈ సినిమా స్టోరీ హాలీవుడ్ రేంజ్లో ఉంద‌న్న ప్ర‌శంస‌లు కూడా వ‌చ్చాయి. అయితే సినిమా ఇప్పుడు బుల్లితెర మీద వ‌చ్చినా కూడా టాప్ టీఆర్పీ రేటింగులు సాధిస్తుంది. ఇంత హిట్ అయిన సినిమా నిర్మాత ముర‌ళీమోహ‌న్‌కు మాత్రం లాభాలు తీసుకు రాలేదట‌.

ఇందుకు కార‌ణం ఓవ‌ర్ బ‌డ్జెట్ అంటారు. ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌కు రెండో సినిమానే పెద్ద హీరోతో చేసే ఛాన్స్ వ‌చ్చింది. అయితే బ‌డ్జెట్ విష‌యంలో ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువ ఖ‌ర్చు పెట్టించేశాడ‌ట‌. సినిమాకు ఎంత ఖర్చు పెట్టాలి అనే దానిపై ద‌ర్శ‌కుడికి అవ‌గాహ‌న లేక‌పోవ‌డంతో బ‌డ్జెట్ పెరిగిపోయింది. అందుకే సినిమాకు లాభాలు రాలేద‌ని అంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news