Moviesఅతనికి ఫోన్ చేసి మరీ గుక్క పట్టి ఏడ్చేసిన సమంత..రీజన్ ఏంటో...

అతనికి ఫోన్ చేసి మరీ గుక్క పట్టి ఏడ్చేసిన సమంత..రీజన్ ఏంటో తెలుసా..??

సమంత.. టాలీవుడ్ కుందనప్పు బోమ్మ. చూడడానికి చక్కటి రూపం..అందరిని ఆకట్టుకునే మాటలు..అద్భుతమైన నటనతో అందరి మనసులను గెలుచుకుంది. ఇక టాలీవుడ్ బడా ఫ్యామిలీ అక్కినేని ఇంటి కోడళు గా అడుగుపెట్టి .. కోడలు గాను మంచి మార్కులు వేయించుకుంది. క్రేజీ బ్యూటి అక్కినేని కోడలు పిల్ల సమంత..డివోర్స్ రూమర్స్ తో సోషల్ మీడియాలో ఆమె పేరు మారుమ్రోగిపోతోంది.

నిజానికి నాగ చైతన్య సమంత విడాకులు తీసుకుంటారో లేదో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం వీరి పేర్లు హాట్ టాపిక్ గా మారాయి. పోనీ వీళ్ళు అయినా మేము విడాకులు తీసుకోవట్లేదు..కలిసే ఉంటున్నాం అని చెప్పుతున్నారా..??అది లేదు. దీంతో..గాసిప్ రాయుళ్లు ఇష్టం వచ్చిన్నట్లు వీళ్ల మీద పుకార్లు సృష్టిస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే ఈమె ఓ డైరెక్టర్ కు కాల్ చేసి మరీ గుక్క పట్టి ఏడ్చేసిందంతూ సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చెస్తున్నాయి.

మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నా..”దూకుడు” సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో అత్యంత ప్రత్యేకం. ఎందుకంటే.. పోకిరి సినిమా ఎంత పెద్ద హిట్టో మళ్ళీ అలాంటి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో వచ్చిన చిత్రం “దూకుడు”. దర్శకుడు శ్రీను వైట్ల కాంబోలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సమంతా హీరోయిన్ గా మొదటిసారిగా చేసింది. ఈ చిత్రం నుంచే అప్పటికి యంగ్ హీరోయిన్ గా ఉన్న సమంతకి కూడా బ్రేక్ వచ్చింది.

అయితే తాజాగా శ్రీను వైట్ల దూకుడు సమయంలో సమంతకు ఎదురైన అనుభవాల గురించి చెప్పారు. మనకు తెలిసిందే దూకుడు సినిమా షూటింగ్ ఇస్తాంబుల్ లో చేసారు. అయితే ఒకరోజు సమంత షాపింగ్ కు వెళ్లిన క్రమంలో ఆమెకు ఎదురుగా ఆత్మాహుతి దాడి జరగడంతో.. ఒక్కసారిగా భయపడిన సాం ఏడుస్తూ.. దూకుడు సినిమా డైరెక్టర్ శ్రీను వైట్లకు కాల్ చేసి.. హ్యూమన్ బాంబ్ ను చూసానని చెప్పుతూ… దాని నుండి బయట పడలేక పోయానంటూ చెప్పుతూ గుక్క పట్టి ఏడ్చేసిందట సామ్. అయితే ఎన్ని ఇబ్బందులు పడినా సామ్ తన పాత్రకి న్యాయం చేసిందని .. ఈ సినిమా విజయంలో ఆమె కీలక పాత్ర పోషించిందని చెప్పుకొచ్చారు శ్రీనువైట్ల.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news