Moviesచిరంజీవి పక్కన ఆ భామ.. వద్దు బాబోయ్ వద్దు..మహా డేంజర్..??

చిరంజీవి పక్కన ఆ భామ.. వద్దు బాబోయ్ వద్దు..మహా డేంజర్..??

చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి మలయాళ ‘లూసిఫర్’ తోపాటుగా తమిళ ‘వేదాళం’ చిత్రాన్ని కూడా రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే 2015లో అజిత్ హీరోగా దర్శకుడు శివ తెరకెక్కించిన వేదాళం మూవీ రీమేక్ లో చిరంజీవి నటించనున్నారు. అయితే ఈ మూవీలో చెల్లెలు పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఈ పాత్ర విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

అయితే వేదాళం తెలుగు రీమేక్ లో చిరంజీవి చెల్లెలు పాత్ర కోసం మహానటి సినిమాతొ టాప్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోయిన కీర్తి సురేష్ ని పెట్టనున్నారని వార్తలు జోరుగా వస్తున్నాయి. వేదాళం’ ఒరిజినల్ వెర్సన్ లో అజిత్ కు జోడీగా శృతిహాసన్ నటిస్తే.. చెల్లెలుగా లక్ష్మీ మీనన్ కనిపించింది. ఇప్పుడు మెగా రీమేక్ లో లక్ష్మీ మీనన్ పాత్రలో కీర్తి కనిపించనుందని అంటున్నారు. అయితే ఒకవైపు చిరంజీవి చెల్లెలుగా రౌడీ బేబీ సాయి పల్లవి అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు అనుకుంటున్నారట.

కానీ చిరంజీవి .. కీర్తి సురేష్ అయితే ఎక్స్ప్రేషన్స్ బాగ కళ్లతో బాగా పలికిస్తుంది అని అంటున్నారట. త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఇక ఈ మహానటి ఒప్పుకుంటే ఈ పాత్ర కు న్యాయం జరుగుతుందని కొందరు అంటుంటే..మరి కొంతమంది అసలు చిరు పక్కన కీర్తి ఏం సెట్ అవ్వదని.. ఆమె ని పెట్టడం వల్ల టోటల్ కధ డ్యామేజ్ అవుతుందని..అంటున్నారు. మరి చూడాలి ఈ పాత్రకు ఎవరు ఓకే చెప్పుతారో .. ఫైనల్ గా ఏవరు సెట్స్ లోకి వెళతారో..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news