Moviesమ‌ల్లీశ్వ‌రి సినిమా రెమ్యున‌రేన్‌కు క‌త్రీనా బ్లాక్ మెయిల్ ... ఎంత తీసుకుందంటే..

మ‌ల్లీశ్వ‌రి సినిమా రెమ్యున‌రేన్‌కు క‌త్రీనా బ్లాక్ మెయిల్ … ఎంత తీసుకుందంటే..

రెండు ద‌శాబ్దాల క్రితం క‌త్రినా కైఫ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు ఎలా ఉందో ఇప్పుడు దాదాపు అంతే సైజ్‌లో ఆమె ఉంది. క‌త్రినా అందం ఇప్ప‌ట‌కీ చెక్కు చెద‌ర్లేదు. ఇంత సుదీర్ఘ‌కాలంగా బాలీవుడ్‌లో కెరీర్ కొనసాగించ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఇక ఆమె తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది. విక్ట‌రీ వెంక‌టేష్ ప‌క్క‌న మల్లీశ్వ‌రి, బాల‌య్య ప‌క్క‌న అల్ల‌రి పిడుగు సినిమాలు చేసింది. ఇక తెలుగులో ఆమె తొలి సినిమా మ‌ల్లీశ్వ‌రి. ఇక ఈ సినిమాకు కె. విజ‌య్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ సినిమాను నిర్మించింది.

Malliswari (2004)

ఈ సినిమాలో న‌టించినందుకు గాను క‌త్రీనాకు అప్ప‌ట్లోనే 70 ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ ఇచ్చార‌ట‌. ముందు ఆమెతో అంత‌క‌న్నా త‌క్కువ రెమ్యున‌రేష‌న్ మాట్లాడుకున్నాక ఆ త‌ర్వాత ఆమె మ‌రింత డిమాండ్ చేయ‌డంతో పాటు ఇక్క‌డ హోట‌ల్ బిల్స్ అన్ని క‌ట్టాల‌ని లేకుంటే షూటింగ్‌కు రాన‌ని చెప్పి ముంబై చెక్కేసింద‌ట‌. మ‌ళ్లీ సినిమా యూనిట్ ఆమెతో చ‌ర్చించి అప్పుడు రెమ్యున‌రేష‌న్ పెంచితే కానీ క‌త్రీనా తిరిగి షూటింగ్‌కు రాలేద‌న్న టాక్ ఉంది. ఈ విష‌యాన్ని సురేష్ కూడా ప‌లుసార్లు చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news