Politicsబ్రేకింగ్‌: ఏపీ మంత్రి బొత్స ఇంట్లో విషాదం

బ్రేకింగ్‌: ఏపీ మంత్రి బొత్స ఇంట్లో విషాదం

ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఇంట్లో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం జ‌గ‌న్ కేబినెట్లో పురపాలక శాఖ మంత్రిగా ఉన్న సీనియ‌ర్ నేత‌ బొత్స సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ(84) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె విశాఖలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమెకు ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం. మొత్తం 11 మంది సంతానం కావ‌డంతో జిల్లాలో వీరికి బ‌ల‌మైన బంధుత్వం ఉంది.

 

దీంతో ఇది బొత్స‌కు ఆయ‌న కుటుంబానికి రాజ‌కీయంగా కూడా చాలా క‌లిసొచ్చింది. ఇక మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద కుమరుడు కాగా రెండో కుమారుడు బొత్స అప్పల నరసయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయనగరంలోని స్వర్ఘధామంలో ఆమె అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నాం నిర్వహించనున్నారు. ఇక బొత్స కుటుంబానికి ప‌లువురు వైసీపీ నేత‌ల‌తో పాటు ఇత‌ర పార్టీల నేత‌లు త‌మ ప్ర‌గాడ సానుభూతి తెలుపుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news