Moviesఅప్పుడు సావిత్రి.. ఆ తరువాత సౌందర్య ..ఇప్పుడు సాయి పల్లవి .....

అప్పుడు సావిత్రి.. ఆ తరువాత సౌందర్య ..ఇప్పుడు సాయి పల్లవి .. వీళ్లకి ఈ పిచ్చెంట్రా బాబు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని జనాల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు కొంతమంది హీరోయిన్స్ . వాళ్ళల్లో సావిత్రి – సౌందర్య – శ్రీదేవి ఇలా చాలామంది ఉన్నారు . అయితే మహానటి అనగానే అందరికీ టక్కున గుర్తుచేది సావిత్రి. సినిమా ఇండస్ట్రీని తనదైన స్టైల్ లో ఏ లేసిన సావిత్రి ఆఖరి రోజుల్లో ఎలాంటి పరిస్థితిని ఫేస్ చేసుకుందో మనకు తెలిసిందే.

అయితే సావిత్రికి అన్ని కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఆఖరి రోజుల్లో అలాంటి దీనమైన స్థితి ఎదుర్కోవడానికి కారణం ఆమెకున్న మంచితనమే అంటూ కొంతమంది అవహేళనగా మాట్లాడేవారు . సావిత్రి కి మరీ మంచితనం ఎక్కువ అని మంచితనం కూడా హద్దుల్లోనే ఉండాలి అని.. మంచితనం టూ మచ్ అయిపోతే ఇలాంటి పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది అని.. అప్పట్లో జనాలు ఆమెపై వ్యంగ్యంగా కౌంటర్స్ వేశారు .

అంతేకాదు హీరోయిన్ సౌందర్య కూడా సావిత్రి లాగా దానధర్మాలు ఎక్కువగా చేస్తూ వచ్చేదట. అంతేకాదు, ఆమె రెమ్యూనరేషన్ లో సగానికి పైగానే తోటి ఆర్టిస్టులకి ..హెల్ప్ కోసం వెయిట్ చేసే వాళ్ళ కోసం ఖర్చు పెట్టేదట .ఇప్పుడు అదే పని చేస్తుంది హీరోయిన్ సాయి పల్లవి అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. సాయి పల్లవి కూడా ఎక్కువగా దానధర్మాలు చేస్తూ ఉంటుందట. డబ్బు గురించి పెద్దగా పట్టించుకోదట. ఆమె మంచితనమే ఆమెకు ఇంపార్టెంట్ అట. దీంతో వీళ్ళ ముగ్గురిలో ఉన్న బ్యాడ్ అండ్ గుడ్ క్వాలిటీ ఇదే అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news