Moviesఓరీ మీ వేషాలోయ్.. అప్పుడే అక్కడ దాకా వెళ్లిపోయారా..? వైరల్...

ఓరీ మీ వేషాలోయ్.. అప్పుడే అక్కడ దాకా వెళ్లిపోయారా..? వైరల్ గా మారిన మహేశ్ పోస్ట్..!!

ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలో .. లేకపోతే వాళ్లపై వాళ్ళకున్న నమ్మకం అనాలో తెలియదు కానీ జనాలు మాత్రం వాళ్లకు ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడుకుంటున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు తాజాగా నటించిన సినిమా గుంటూరు కారం . కేవలం మరికొద్ది గంటలు అంటే కొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. కాగా ఇలాంటి క్రమంలోనే సినిమాకి సంబంధించిన వార్తలు కూడా ఎక్కువగా వైరల్ అవుతున్నాయి .

కాగా రీసెంట్గా గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. చాలా చాలా బాగా జరిగింది ఈవెంట్ . అందరూ వచ్చి మహేష్ బాబుని బ్లెస్ చేయడమే కాకుండా సపోర్ట్ కూడా చేశారు . మహేష్ ఫాన్స్ కి ఒక మరుపురాని ప్రీ రిలీజ్ ఈవెంట్ గా నిలిచిపోయింది. కాగా పలు కారణాల చేత హడావిడిగా ఈవెంట్ ముగించినప్పటికీ.. మహేష్ మాట్లాడిన మాటలు అభిమానుల గుండెల్లో బాగా గుచ్చుకున్నాయి .

కాగా ఈవెంట్లో సంగీత దర్శకుడు తమన్..” తాను ఇప్పుడేం మాట్లాడను అని మొత్తం సక్సెస్ మీట్ లోనే మాట్లాడుతానని “చెప్పాడు. అంతేకాదు చాలామంది కూడా ఎక్కువ టైం టేకింగ్ తీసుకోకుండా స్పీచ్ ని ముగించేశారు. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో మహేష్ బాబు పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది . “తాను పుట్టిన ప్రాంతం గుంటూరు ప్రేక్షకులకి .. ధన్యవాదాలు తెలియజేస్తూ ఈవెంట్ ని మీ ప్రేమని ఎప్పటికీ నేను గుండెల్లో దాచుకుంటాను అని చెప్పకొచ్చారు . మళ్ళీ అతి త్వరలోనే కలుద్దాం అంటూ కూడా హింట్ ఇచ్చారు”. అంటే గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ ని మళ్ళీ గుంటూరులోనే చేయబోతున్నారు అనేగా అంటున్నారు అభిమానులు . అంతేకాదు ఈ సినిమా రెండు రోజుల్లోనే 100 కోట్లు క్రాస్ చేస్తుంది అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news