Movies"ఆ రెండిటిని వదిలేసేయ్ ..బాగుపడతావ్".. మంచు లక్ష్మికి అల్లు అర్జున్ గూబ...

“ఆ రెండిటిని వదిలేసేయ్ ..బాగుపడతావ్”.. మంచు లక్ష్మికి అల్లు అర్జున్ గూబ గుయ్యమనే సజెషన్..పోలా అద్దిరిపోలా..!

సోషల్ మీడియాలో ఏ చిన్న వార్త అయినా సరే రాద్ధాంతం చేస్తూ ఉంటారు కొంతమంది జనాలు . మరీ ముఖ్యంగా ట్రోల్లర్స్ , మీమర్స్ ఎప్పుడెప్పుడు స్టార్ సెలబ్రెటీస్ చిక్కుతారా..? వాళ్లని ఏకిపారేద్దాం.. అంటూ రెడీగా ఉంటారు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో లక్ష్మీ మంచు పై సోషల్ మీడియాలోఎంత ట్రోలింగ్ జరిగిందో మనం చూసాం. రీసెంట్గా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఆమెకు ఒక బిగ్ టాస్క్ ఇచ్చాడు .

ఇదే విషయాన్ని లక్ష్మీ మంచు షేర్ చేస్తూ ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పేసింది . ఒక నెల రోజులపాటు అన్నం నాన్ వెజ్ తినకుండా ఉండాలి అంటూ అల్లు అర్జున్ లక్ష్మి మంచుకి ఛాలెంజ్ విసురుతాడు. దానికి మంచు లక్ష్మి కూడా ఒప్పుకునింది . ఈ విషయాన్ని అంగీకరిస్తూ పోస్టు ద్వారా అందరికీ తెలిపింది . “అల్లు అర్జున్ నా గోల్స్ పబ్లిక్ తో షేర్ చేసుకోవాలని తెలిపారు. నేను అంగీకరిస్తున్నాను నేను ఈ నెలలో రైస్, నాన్ వెస్కి దూరంగా ఉండాలి అన్న ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నాను.. నాకు ఆ రెండు చాలా ఇష్టం ఫేవరెట్ ..చూద్దాం ఏం జరుగుతుందో” అంటూ రాసుకొచ్చింది.

అయితే చాలామంది ఫ్యాన్స్ మంచు లక్ష్మికి ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు . “నిజం ఆ రెండు నువ్వు వదిలేసేయ్ లైఫ్ లో బాగుపడతావ్.. ఆ రెండు దేనికి మంచిది కాదు .. కేవలం మంచు లక్ష్మికే కాదు అందరికీ కూడా నాన్ వెజ్ తినడం అంత ఆరోగ్యానికి మంచిది కాదు రైస్ కూడా కార్బోహైడ్రేట్ నేటి జనరేషన్ కి అస్సలు మంచిది కాదు: అంటూ సజెస్ట్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో మంచు లక్ష్మి షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news