Moviesబిగ్ బ్రేకింగ్: ఆగిపోయిన మహేశ్-రాజమౌళి సినిమా.. కొత్త ప్రాజెక్ట్ లో భాగమైన...

బిగ్ బ్రేకింగ్: ఆగిపోయిన మహేశ్-రాజమౌళి సినిమా.. కొత్త ప్రాజెక్ట్ లో భాగమైన జక్కన్న..ఎందుకంటే..?

యస్.. ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ అడ్వెంచర్స్ ప్రాజెక్టుకు మహెశ్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుంది అంటూ కూడా ప్రచారం జరిగింది . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమాను ఆపేసి మరో ప్రాజెక్టు ను తెరకెక్కించే పనిలో బిజీ అయిపోవాలి అనుకుంటున్నాడట రాజమౌళి. మరీ ముఖ్యంగా రాజమౌళి జాతకం ప్రకారం మహేష్ బాబుతో ఈ టైంలో సినిమా తీస్తే ఖచ్చితంగా డిజాస్టర్ అవుతుందని.. ఓ పండితులు చెప్పుకొచ్చారట . అయితే మొదటి నుంచి ఇలాంటివి పెద్దగా నమ్మని రాజమౌళి అనుకోకుండా ఆ సినిమా లేట్ అవుతూ రావడం జరిగింది .

మహేష్ బాబు గుంటూరు కారం సినిమా స్టార్ట్ చేశాక ఎన్ని అవాంతరాలు ఎదురయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే రిలీజ్ అయిపోవాల్సింది. కానీ మధ్యలో ఏర్పడిన కొన్ని ప్రాబ్లమ్స్ కారణంగా సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇప్పటికీ సగం షూటింగ్ ఇంకా పెండింగ్ లోనే ఉంది . ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో..? రాజమౌళికి ఎప్పుడు కాల్ షీట్స్ ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.

ఈ క్రమంలోనే రాజమౌళి ఈ సినిమాను హోల్డ్ లో పెట్టి మరో చిన్న సినిమాను తెరకెక్కించే విధంగా ఆలోచిస్తున్నారట. అంతేకాదు చాలా రియలిస్టిక్ గా లవ్ ఫ్యామిలీ డ్రామా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారట . అన్ని కుదిరితే ఆరు నెలల్లో ఈ సినిమాను డైరెక్ట్ చేసి రిలీజ్ కూడా చేసేస్తారట . ఆ తర్వాత మహేష్ బాబు సినిమాను తెరకెక్కించే ఆలోచన చేయబోతున్నాడు రాజమౌళి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ డీప్ గా హర్ట్ అయిపోతున్నారు . నిజంగా రాజమౌళి – మహేష్ బాబుతో సినిమాలు ఆపేస్తే మాత్రం పెద్ద యుద్ధమే జరిగిపోతుంది . దీనిపై పూర్తి వివరాలు తెలియాలంటే రాజమౌళి లేక మహేష్ బాబు స్పందించాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news