Newsమిస్ శెట్టి సినిమాకు అనుష్క రెమ్యున‌రేష‌న్ ఇదే... సినిమాల్లేక‌పోయినా క్రేజ్ త‌గ్గ‌లేదుగా..!

మిస్ శెట్టి సినిమాకు అనుష్క రెమ్యున‌రేష‌న్ ఇదే… సినిమాల్లేక‌పోయినా క్రేజ్ త‌గ్గ‌లేదుగా..!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క నాలుగు పదుల వయసుకు చేరువయ్యింది. ఇటీవల కాలంలో ఆమె సినిమాల స్పీడు తగ్గించేసింది. 2019లో చిరంజీవి సైరా సినిమాతో ఆమె వెండితెరపై మెరిసింది. 2020 ఆమె నటించిన నిశ్శబ్దం నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది. అంటే అనుష్క సిల్వర్ స్క్రీన్ పై కనిపించి మూడేళ్లు దాటుతోంది. చాలా కాలం తర్వాత ఆమె యూవీ క్రియేషన్స్ బ్యానర్లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

తనకంటే వయసులో చిన్నోడు అయిన‌ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జోడీగా ఆమె నటిస్తోంది. సెప్టెంబర్ 7న ఏ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. గతంలో అనుష్క ఒక్కో సినిమాకు మూడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునేది. అయితే అది అప్పటి ముచ్చట.. బాహుబలి సినిమాకు మాత్రం కాస్త ఎక్కువగానే ఇచ్చారు. ఆ సినిమాకు ఎక్కువ రోజులు కాల్షీట్లు కేటాయించాల్సి రావడంతో రాజమౌళి పట్టుబట్టి ఆమెకు కాస్త ఎక్కువ రెమ్యునరేషన్ ఇప్పించారు.

ప్రస్తుతం అనుష్క తన రెమ్యునరేష్ డబుల్‌ చేసినట్టు తెలుస్తోంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు ఆమె ఏకంగా ఆరు కోట్లు తీసుకున్నట్టు సోషల్ మీడియా సర్కిల్స్ లో ఒక వార్త వైరల్ అవుతుంది. ఇక యూవీ క్రియేషన్స్ అంటే ఆమెకు సొంత బ్యాన‌ర్‌ లాంటిది. ఇది ప్రభాస్ స్నేహితుల బ్యానర్. దీంతో అనుష్కకు వాళ్ళు ఆమె రేంజ్ కు తగినట్టుగా.. ఎప్పుడు స్టార్ హీరోయిన్లు ఎంత ? తీసుకుంటున్నారో అంతే మొత్తాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

ఏది ఏమైనా అనుష్క ఈ సినిమాతో తాను కం బ్యాక్ అవుతాను అన్న ధీమాత ఉంది. ఈ సినిమా సక్సెస్ అయితే ఆమె టాలీవుడ్ సీనియర్ హీరోలకు మంచి ఆప్షన్ గా మారుతుంది అనటంలో సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news