Moviesరాజ‌మౌళి మ‌రో మ‌ల్టీస్టార‌ర్ సినిమా… హీరోలు ఎవ‌రంటే…!

రాజ‌మౌళి మ‌రో మ‌ల్టీస్టార‌ర్ సినిమా… హీరోలు ఎవ‌రంటే…!

టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి గ‌తేడాది త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టారు. ఇది రాజ‌మౌళికి వ‌రుస‌గా 12వ విజ‌యం. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్‌బాబుతో రాజ‌మౌళి అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కించేందుకు రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సినిమా ఎప్పుడు ? స్టార్ట్ అవుతుంది ? అంటూ మహేష్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు సినీ ల‌వ‌ర్స్ అంద‌రూ ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు

ఈ క్ర‌మంలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుపై టాలీవుడ్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో రోజుకొక పుకారు వైరల్ అవుతోంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్టును దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ నిర్మాత డాక్ట‌ర్ కేఎల్‌. నారాయ‌ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రు. 500 కు పైగా రు. 600 కోట్ల రేంజ్ బ‌డ్జెట్ అవుతుంద‌ని ముందుగానే లెక్క‌లు వేస్తున్నారు. ఈ సినిమా రెండు పార్ట్ లుగా రాబోతుందని.. మొదటి పార్ట్ లో మహేష్ హీరోగా, రెండో పార్ట్ లో మరో స్టార్ హీరో హీరోగా నటిస్తాడని అదిరిపోయే రూమ‌ర్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇక ఫ‌స్ట్ పార్ట్ అంతా మ‌హేష్ హీరోగానే ఉంటాడ‌ని.. సెకండ్ పార్ట్‌లో మ‌హేష్ పాత్ర కాస్త త‌క్కువుగా ఉంటుంద‌ని.. బాలీవుడ్ స్టార్ హీరో ఒక‌రు మెయిన్ రోల్లో న‌టిస్తాడ‌ని తెలుస్తోంది. మ‌హేష్‌బాబు పుట్టినరోజు సంద‌ర్భంగా ఆగస్ట్ 9న ఈ సినిమా ప్రారంభోత్స‌వం ఉంటుంద‌ని తెలుస్తోంది. ప్రస్తుతం మహేశ్‌.. త్రివిక్రమ్‌తో చేస్తోన్న గుంటూరు కారం సినిమాను నవంబర్ లోపు పూర్తి చేస్తాడ‌ని.. ఆ వెంట‌నే రాజ‌మౌళి సినిమా కోసం జాయిన్ అవుతాడ‌ని తెలుస్తోంది.

ఇక స్టార్ స్టోరీ రైట‌ర్ విజయేంద్రప్రసాద్‌, మహేశ్‌ కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్టు రాశారట‌. ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని స‌మాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news