Moviesరిలీజ్ అయిన కొద్ది గంటలకే.. ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కి భారీ...

రిలీజ్ అయిన కొద్ది గంటలకే.. ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కి భారీ షాక్..ఆ డైలాగ్ తీసేయాలంటూ గోల..!!

టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా ఆది పురుష్. రామాయణ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ ని నమోదు చేసుకుంది . బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ చేసిన డైరెక్ట్ చేసిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. చిన్న పెద్ద అందరు కుటుంబ సమేతంగా చూసే విధంగా డిజైన్ చేయడం అభిమానులకు మరింత స్థాయిలో నచ్చేసింది.

కాగా ఈ సినిమాలో రాముడు పాత్రలో ప్రభాస్ కనిపించగా ..సీతాదేవి పాత్రలో కృతి సనన్.. రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 6200 థియేటర్స్ లో రిలీజ్ అయింది . అంతేకాదు ఇండియాలోనే దాదాపు 4వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది, అయితే ఈ సినిమాకు నేపాల్లో అడ్డంకులు ఎదురైయాయి.

ఈ సినిమా మొత్తం నేపాల్ జనాలకు నచ్చిన ఓ డైలాగ్ ని మాత్రం తీసేయ్యాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు . ఆ డైలాగ్ తీసేస్తేనే సినిమాకి అనుమతి ఇస్తామంటూ డిమాండ్ చేస్తున్నారు . ఇక ఈ డైలాగ్ పై నేపాల్ నేతలు కూడా మండిపడుతున్నారు. ఆదిపురుష్ సినిమాలో సీతామాత భారత్ లో జన్మించినట్లు ఓ డైలాగు ఉంటుంది . నిజానికి చరిత్ర ప్రకారం సీతామాత నేపాల్ లోనే జన్మించారు. దీంతో నేపాల్ జనాల మనోభావ్లు దెబ్బతిన్నాయి. ఆ డైలాగ్ తీసేయకుంటే సినిమాని బాయ్ కాట్ చేస్తామంటూ డిమాండ్ చేశారు. దీంతో చిత్ర యూనిట్ ఆ సినిమా నుంచి ఆ డైలాగ్ ని తొలగించేసారు. కానీ ఈరోజు మార్నింగ్ షోలు మాత్రం ఆగిపోయాయి. మరి కొద్ది సేపట్లో అక్కడ మొదటి షో పడబోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news