Moviesమొగుడుకన్నా కూడా ఆ డైరెక్టర్ అంటేనే ఎక్కువ ఇష్టమా..? అందరి ముందు...

మొగుడుకన్నా కూడా ఆ డైరెక్టర్ అంటేనే ఎక్కువ ఇష్టమా..? అందరి ముందు ఏంటి ఈ పనులు ఐశూ..?

మాజీ ప్రపంచ సుందరి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ గురించి ఇండియన్ సినిమా జనాలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఇరువర్ ( తెలుగులో ఇద్దరు ) సినిమాతో ఆమె హీరోయిన్గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత మరో తమిళ దర్శకుడు శంకర్ జీన్స్ సినిమాతో ఆమెకు తిరిగిలేని స్టార్ ఇమేజ్ వచ్చింది. అక్కడి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా బాలీవుడ్లో టాప్ హీరోయిన్ అయిపోయారు.

2010లో గుజారిష్‌ సినిమా తర్వాత పెళ్లి చేసుకున్న ఆమె ఐదారేళ్ల పాటు సినిమాలకు దూరమయ్యారు. తర్వాత 2015 జాబ్బా సినిమాతో వెండితెర‌పై రీ ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక ఐశ్వర్య హీరోయిన్ పాత్రలకు కాకుండా… డిఫరెంట్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళుతున్నారు. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో వ‌చ్చిన పొన్నియ‌న్ సెల్వ‌న్‌ సినిమాతో తిరిగి సౌత్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

ఈ సినిమాలో ఆమె నందిని అనే నెగటివ్ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించారు. ఈ నెల 28న పిఎస్ 2 సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో కూడా ఐశ్వర్య పాత్ర చుట్టూనే కథ‌ నడుస్తుందని తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లు తాజాగా హైదరాబాదులో జరిగాయి. ఈ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఐశ్వర్య దర్శకుడు మణిరత్నం పాదాలను తాకుతూ నమస్కారం చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఐశ్వర్య వంగి మరి మణిరత్నం పాదాలను తాకి నమస్కారం చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది.

మణిరత్నంను ఐశ్వర్య తన గురువు స్థానంలో చూస్తారు.. ఆమెకి హీరోయిన్గా మొదటి అవకాశం ఇచ్చిన మణిరత్నం తర్వాత రావన్‌ సినిమాని ఆమె పాత్రను హైలెట్‌గా చేసి తెర‌కెక్కించారు. ఇప్పుడు సినిమాతో ఆమెను విలన్ గా పరిచయం చేశారు. ఇప్పుడు తనకు హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వడంతో పాటు తనలో గ్లామర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేయటం.. ఇప్పుడు తనలో విలనిజాన్ని కూడా చూపించడంతో మణిరత్నం అంటే ఐశ్వర్య ఎంతో ఇష్టపడతారు.

అందుకే ఆమె తన కృతజ్ఞతను ఇలా చూపించుకున్నారు. ఐశ్వర్యరాయ్ మణిరత్నం పాదాలకు నమస్కరిస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె అంత పెద్ద స్టార్ అయినా కూడా మూలాలు ఎప్పుడు మర్చిపోలేదని నేటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news