Moviesఅప్పుడు నాగార్జునని లవ్ చేయ‌డ‌మే ట‌బు కెరీర్‌కు శాప‌మైందా... అస‌లేం జ‌రిగిందంటే...!

అప్పుడు నాగార్జునని లవ్ చేయ‌డ‌మే ట‌బు కెరీర్‌కు శాప‌మైందా… అస‌లేం జ‌రిగిందంటే…!

టాలీవుడ్‌లో కింగ్ నాగార్జున, మన్మధుడు లాంటి రొమాంటిక్ పేర్లు సంపాదించుకున్నారు అక్కినేని నాగేశ్వర రావు వారసుడు అక్కినేని నాగార్జున. నాగార్జున కెరీర్‌లో ముందు ఫ్లాప్ హీరో అని పేరొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నెమ్మదిగా నాగార్జున హిట్స్ అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద అక్కినేని వారసుడిగా కాకుండా తనకంటూ ఓ మార్కెట్‌ను సంపాదించుకున్నారు.

ఇక నాగార్జున ఎక్కువగా తండ్రిలాగా రొమాంటిక్ సినిమాలు చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, నాగార్జున జనరేషన్‌లో ఎక్కువగా యూత్ ఆడియన్స్ కనెక్ట్ అవడం వల్ల అమ్మాయిల ఫాలోయింగ్ మాత్రమే కాకుండా ఆయన సరసన హీరోయిన్‌గా నటించిన వారూ..మిగతా హీరోయిన్స్ నాగార్జున అంటే పడి చచ్చిపోయారు. మన్మధుడు అంటూ ఎక్కడ కనిపించిన రచ్చ చేశారు. ఇదిలా ఉంటే ప్రేక్షకుల్లో అలాగే కొన్ని ఇండస్ట్రీ వర్గాలలో నాగార్జునకి హీరోయిన్స్‌తో బాగానే ఎఫైర్స్ ఉంటాయని మాట్లాడుకుంటుంటారు.

ముఖ్యంగా అప్పట్లో టబు..ఆ తర్వాత శ్రియ, అనుష్క‌ లాంటి క్రేజీ హీరోయిన్స్ నాగ్ అంటే అన్ని వదిలేసి వెంట వచ్చేస్తారని చెప్పుకుంటారు. అయితే, శ్రియ ఇప్పటికే, పెళ్లి చేసుకొని ఓ బిడ్డకి తల్లిగా చక్కటి కుటుంబ జీవితం గడుపుతోంది. మరోవైపు సినిమాలు చేసుకుంటోంది. సోషల్ మీడియాలో ఎంతగా యాక్టివ్‌గా ఉంటుందో తెలిసిందే. కానీ, నిన్నే పెళ్ళాడతా అంటూ నాగార్జునతో రొమాన్స్ చేసిన టబు మాత్రం లైఫ్‌లో సోలోగా ఉండిపోయింది.

బాలీవుడ్‌లో అప్పుడప్పుడు టాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న టబు నటిగా మాత్రం ఇంకా క్రేజ్ తగ్గలేదు. టబు అంటే అందరికీ గుర్తొచ్చే సినిమాలు నిన్నే పెళ్ళాడతా, ప్రేమదేశం. నిన్నే పెళ్ళాడతా సినిమాతో నాగార్జునకి బాగా కనెక్ట్ అయిన టబు..పీకల్లోతు ప్రేమలో మునిగితేలిందని అప్పట్లో బాగా టాక్ వినిపించింది. ఆ త‌ర్వాత అదే నాగ్‌తో ఆవిడా మాఆవిడే సినిమా కూడా చేసింది.

నాగార్జున‌తో పిచ్చి ప్రేమ వల్లే ఇలా సోలోగా మిగిలిందని లేకపోతే, శ్రియ, కాజల్ అగర్వాల్ లాంటి నవతరం కథా నాయికలలాగా టబు కూడా ఓ అందమైన ఫ్యామిలీ లైఫ్‌ను లీడ్ చేసేది. కింగ్‌తో లవ్‌లో పడే ఇలా సోలో అయిపోయిందని ఇప్పటికీ టాక్ ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news