Moviesఛార్మీని కావాల‌ని ఐటెం గ‌ర్ల్‌గా మార్చేసింది ఎవ‌రు... ఏం జ‌రిగింది..!

ఛార్మీని కావాల‌ని ఐటెం గ‌ర్ల్‌గా మార్చేసింది ఎవ‌రు… ఏం జ‌రిగింది..!

అందుకే ఛార్మీని ఐటెం భామని చేసేశారు..! కొందరు నెటిజన్స్ స్టార్ హీరోయిన్‌గా వెలిగిన ఛార్మీ కౌర్ గురించి మాట్లాడుకుంటున్నారు. నీతోడు కావాలి సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఛార్మీ..ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దృష్ఠిలో పడి ఆయన దర్శకత్వంలోనే వరుసగా సినిమాలు చేసింది. అయితే, వాటిలో ఫ్లాపవడంతో చాలా నెగిటివిటీ వచ్చింది. అయినా కూడా ఇవేవీ పట్టించుకోకుండా రాఖీ సినిమాతో హిట్ ఇచ్చారు కృష్ణవంశీ.

అలాగే, నాగార్జున హీరోగా నటించిన మాస్ సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ప్రభాస్, ఎన్.టి.ఆర్, నాగార్జున లాంటి స్టార్స్ సరసన నటించడం ఛార్మీకి బాగా కలిసి వచ్చింది. తన ఖాతాలో గౌరీ లాంటి సినిమాలూ ఉన్నాయి. అయితే, ఛార్మీ ఫిజిక్‌కి హీరోయిన్‌గా కంటే ఐటెం గాళ్ అయితే ఇంకా బావుంటుందని మేకర్స్ ఆలోచించారు.

అందుకే, వరుసగా స్పెషల్ సాంగ్స్ చేసే ఛాన్స్ దక్కించుకుంది. బొద్దుగా ఉన్నా ర‌గ‌డ‌, రాఖీ, మంత్ర, ఢమరుకం, నాయక్ లాంటి సినిమాలలో ఛార్మీ సాంగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. వెంకటేష్ సరసన నటించిన లక్ష్మీ సినిమా కూడా మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన జ్యోతిలక్ష్మీ పెద్ద హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిర్మాతగానూ మారిన విషయం అందరికీ తెలిసిందే.

ఛార్మీలో ఉన్న బొద్దు అందాలతో ఐటెంస్ సాంగ్స్ చేసే ఛాన్స్ రావడం..అవి సక్సెస్ కావడంతో అందరూ తనలో ఐటెం భామనే చూశారు. కానీ, 15 ఏళ్ళు నటించిన ఛార్మీకి మేకప్ మీద బోర్ కొట్టింది. అందుకే, ఇక సినిమాలలో నటించకూడదని ఫిక్సైంది. కానీ, సినిమాలకి మాత్రం దూరం కాలేదు. నిర్మాతగా పెద్ద బాధ్యతను మోస్తుంది. మరి మళ్ళీ అమ్మడు ఎప్పుడు మొహానికి రంగేసుకుంటుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news