Movies"ఆది పురుష్" నిర్మాత నోటి దూల..ప్రభాస్ అభిమానులకు మండిపోతోంది..!!

“ఆది పురుష్” నిర్మాత నోటి దూల..ప్రభాస్ అభిమానులకు మండిపోతోంది..!!

ఏంటో..ఈ మధ్య ప్రభాస్ టైం అస్సలు బాగోలేదు అనిపిస్తుంది. ఓ వైపు సినిమాలు ఫ్లాప్ అవుతున్న బాధలో ఆయన ఉంటే..మరో వైపు ఆయన తో సినిమాకి కమిట్ అయిన మేకర్స్ మాటల వల్ల నానా ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు ఫ్యాన్స్..మా హీరో సినిమా కు సంబంధించిన అప్డేట్ ఎక్కడ రా సామీ అంటూ సోషల్ మీడియాలో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇవి చాలవు అన్నట్లు రీసెంట్ గా ప్రభాస్ కు మరో బిగ్ ప్రాబ్లమ్ తెచ్చిపెట్టారు ఆది పురుష్ సినిమా నిర్మాతలు.

బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‏గా మారిపోయిన ప్రభాస్..ఇప్పుడు ఏ సినిమా తీసిన ఆ రేంజ్ లోనే ఉండేలా చూసుకుంటున్నాడు. పాన్ ఇండియా సినిమా ‘సలార్’, అలాగే ప్రాజెక్ట్ K షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. అయితే, ఆయన ఆల్రెడీ నటించిన పాన్ ఇండియా సినిమా “ఆది పురుష్” కి సంబంధించి ఇప్పటీ వరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వ లేదు..ఏవో కొన్ని లుక్స్ బయటకు వచ్చినా దాంతో ఫ్యాన్స్ సంతృప్తి పడలేదు.

దీంతో సినిమా డైరెక్టర్ ఓం రౌత్ మీద ఫర్ అవుతూనే ఉన్నారు ఆయన ఫ్యాన్స్. రామాయ‌ణంలోని ఓ ఘ‌ట్టం ఆధారంగా ఆదిపురుష్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. రాముడిగా ప్ర‌భాస్ న‌టిస్తుండ‌గా… ప్ర‌తినాయ‌కుడు లంకేశ్ రోల్లో బాలీవుడ్ క్రేజీ హీరో సైఫ్ ఆలీఖాన్ న‌టించాదూ. ఆదిపురుష్’ సినిమాను అనౌన్స్ చేసి రెండే ళ్లు అవుతుంది. ఇప్పటిదాకా సినిమాకి సంబంధించి కీలక అప్డేట్స్ ఏం ఇవ్వలేదు. కానీ, సినిమా టికెట్ల విషయంలో మాత్రం..నిర్మాతలు సంచలన కామెంట్స్ చేశారు.

2023 సంక్రాంతికి రిలీ అవన్నున్న ఈ సినిమా టికెట్స్ ధరల పై ఆది పురుష్ నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు కని విని ఎరుగని రీతిలో ఈ సినిమా టికెట్ల ధరలు ఉండబోతున్నాయని ఆయన ప్రకటించారు. దీంతో ప్రభాస్ అభిమానులకు మండిపోతుంది. సినిమా కి సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వండి రా అంటే..మీకు లాభాలు వచ్చే టికెట్ల గురుంచి చెప్పుతున్నారు ఏంటి అంటూ మండిపడుతున్నారు. పైగా సినిమా బడ్జెట్ గురించి, బిజినెస్ గురించి, ఇలా ఘనంగా స్టేట్మెంట్స్ ఇచ్చినా పర్లేదు కానీ, టికెట్ల ధరలు భారీగా ఉండబోతున్నాయని చెప్పి షాక్ ఇవ్వడం ఏంటి రా సామీ అంటూ బుతులు తిడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news