Moviesరేణు దేశాయ్ కంటే ప‌వ‌న్ ఆ హీరోయిన్‌తో రియ‌ల్ ప్రేమ‌లో పడ్డాడా...?

రేణు దేశాయ్ కంటే ప‌వ‌న్ ఆ హీరోయిన్‌తో రియ‌ల్ ప్రేమ‌లో పడ్డాడా…?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు రీల్ లైఫ్ ప్రేమ‌లో ఎన్నో ఉన్నాయి. ఆయన రియల్ లైఫ్‌లో మాత్రం మూడు పెళ్లిళ్లు జ‌రిగాయి. ముందుగా వైజాగ్‌కు చెందిన నందిని అనే అమ్మాయితో ప‌వ‌న్ పెళ్లి జ‌రిగింది. పెళ్ల‌య్యాక యేడాదికే మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో వారు వేర్వేరుగా ఉండ‌డం ప్రారంభించారు. ప‌వ‌న్‌కు నందినితో పెళ్ల‌య్యే టైంకు హీరోగా పెద్ద స్టార్ డ‌మ్ కూడా లేదు. ఆ త‌ర్వాత వ‌రుస హిట్ల‌తో ఒక్క‌సారిగా తారాజువ్వలా దూసుకుపోయాడు.

ఈ క్ర‌మంలోనే పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో 2000లో బ‌ద్రి సినిమా చేశాడు. ఆ సినిమాలో హీరోయిన్‌గా చేసిన రేణు దేశాయ్‌తో ప్రేమ‌లో ప‌డ్డ ప‌వ‌న్ ఆమెను రెండో భార్య‌గా స్వీక‌రించారు. ఈ దంప‌తుల‌కే అకీరా, ఆద్య అనే పిల్ల‌లు ఉన్నారు. ఇప్పుడు ర‌ష్యాకు చెందిన అన్నా లెజ్నోవాను మూడో భార్య‌గా చేసుకున్న ప‌వ‌న్ రేణుకు విడాకులు ఇవ్వ‌డంతో ఆమె పూణేలో త‌న పిల్ల‌లు, త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఉంటోంది. ప‌వ‌న్ మాత్రం అప్పుడ‌ప్పుడు పిల్ల‌ల కోసం పూణే వెళ్లి వ‌స్తుంటాడు.

ఇక లాంగ్ గ్యాప్ త‌ర్వాత రేణు దేశాయ్ కూడా వెండితెర‌పై మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ప‌వ‌న్ రేణు దేశాయ్ కంటే ముందే మ‌రో హీరోయిన్‌తో ప్రేమ‌లో పడ్డాడన్న సందేహాలు కూడా బ‌ద్రి సినిమా టైంలోనే వినిపించాయి. ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు బద్రి హీరోయిన్ అమీషా ప‌టేల్‌. ఈ విష‌యాన్ని మ‌రోసారి సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గీతా కృష్ణ సైతం త‌న తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పారు. రేణు వాస్త‌వంగా మోడ‌లింగ్ చేసే అమ్మాయి.

ఇక ఆమెను సౌత్‌లో గీతా కృష్ణ డైరెక్ట్ చేసిన టైమ్ సినిమాతో ప‌రిచ‌యం చేయాల‌ని అనుకున్నారు. అయితే ఆ ప్రాజెక్టు లేట్ కావ‌డంతో రేణు కోలీవుడ్‌లో ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జేమ్స్‌బాండ్ సినిమాలో న‌టించేసింది. అలా ఆ సినిమా ఆమెకు సౌత్‌లో తొలి సినిమా అయ్యింది. ఆ వెంట‌నే బద్రి సినిమాలో ఛాన్స్ వ‌చ్చేసింది. ప‌వ‌న్ కూడా ముందు రేణు కంటే అమీషా పటేల్‌నే ప్రేమించాడ‌ట‌. అటు అమీషా కూడా ప‌వ‌న్ స్టార్ డం, క్రేజ్ చూసి మ‌నోడికి ప‌డిపోయింద‌ట‌.

ఇదే విష‌యాన్ని చెప్పిన గీతా కృష్ణ బద్రి సినిమా ఎలా ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీగా ఉందో ఆ సినిమా టైంలో ప‌వ‌న్ – అమీషా – రేణు మ‌ధ్య కూడా రియ‌ల్‌గా ట్రై యాంగిల్ ల‌వ్ స్టోరీయే న‌డిచింద‌న్నారు. సినిమాలో ప‌వ‌న్ – రేణు ముందుగా ల‌వ్ చేసుకుంటారు. త‌ర్వాత రేణు ఛాలెంజ్ చేయ‌డంతో ప‌వ‌న్ – అమీషా ప్రేమ‌లో ప‌డ‌తారు. అయితే నిజంగా ప‌వ‌న్ .. అమీషానే ముందు ఇష్ట‌ప‌డ్డాడ‌ట‌. త‌ర్వాత ఏం జ‌రిగిందో కాని సినిమా పూర్త‌య్యాక కూడా రేణు – ప‌వ‌న్ బాగా ద‌గ్గ‌ర‌య్యారు.

అందుకే తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జానీ సినిమాలో ఆమెకే హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చాడు. అలా వాళ్ల బంధం ఫీక్స్‌కు చేరుకుని స‌హ‌జీవ‌నం చేశారు. ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టాకే వీరు 2009 ఎన్నిక‌ల టైంలో పెళ్లి చేసుకున్నారు. ప‌వ‌న్ రేణుకు విడాకులు ఇచ్చేసి మూడో భార్య‌గా అన్నాను చేసుకుని.. మ‌ళ్లీ ఇద్ద‌రు పిల్ల‌ల‌కు తండ్ర‌య్యాడు. అమీషా మాత్రం 45 ఏళ్లు వ‌చ్చినా కానీ ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. రేణు మాత్రం ప‌వ‌న్‌తో విడాకుల త‌ర్వాత పూణేలో ఉంటోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news