Moviesకత్రినా-విక్కీ జంట పై పోలీస్ కేసు నమోదు..ఓవర్ యాక్షన్ చేస్తే అంతేగా..!!

కత్రినా-విక్కీ జంట పై పోలీస్ కేసు నమోదు..ఓవర్ యాక్షన్ చేస్తే అంతేగా..!!

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ ల పెళ్లి వార్త నేష‌న‌ల్ వైడ్‌గా ఎంత‌లా హాట్ టాపిక్‌గా మారిందో తెలిసిందే. ముందు నుండి ప్రేమలో మునిగి తేలిన ఈ జంట విదేశీ టూర్లూ, బీచ్‌ల‌లో సంద‌డి, ముంబైలో సినిమాలు, షికార్లు మామూలుగా ఎంజాయ్ చేయలేదులేండి ఓ రెంజ్ లో ఎంజాయ్ చేసింది ఈ జంట. పైగా బాలీవుడ్లో సెల‌బ్రిటీల పార్టీల‌కు కూడా వీరు చెట్టాప‌ట్టాలేసుకుని హాజ‌రు అవ్వడంతో వీళ్ళ ప్రేమ ప్యూర్ అని కంఫాం అయిపోయింది బాలీవుడ్. ఇక విక్కీ క‌త్రీనాతో పోలిస్తే వ‌య‌స్సులో చాలా చిన్న‌వాడే అయినా కూడా ప్రేమకు ఏవి అడ్డు కాదు అంటూ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయారు.

 

ఈ జంట డిసెంబర్ 10 జైపూర్‌ తేదీ లో అంగరంగ వైభవంగా పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నారట. అయితే తమ పెళ్లి వార్త ఏ మాత్రం బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసు కుంటున్నారట. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ కాబోయే జంట పై పోలీస్ కేసు నమోదు చేసిన్నట్లు తెలుస్తుంది. వీళ్ల పెళ్లి కోసం జైపూర్‌లోని హోటల్ సిక్స్ సెన్సెస్ బర్వారా కోటలో జరగబోతోంది.

కాగా ఇక్కడకు చాలామంది సెలబ్రిటీలు వస్తున్న క్రమంలో వారి భద్రత దృష్ట్యా హోటల్‌కు వచ్చే మార్గాన్ని ఈ నెల 6 నుంచి 12 వరకూ క్లోజ్‌ చేశారట. అయితే స్థానికంగా ఉన్న చౌత్ మాత ఆలయానికి వెళ్లాలంటే ఆ మార్గం గుండానే వెళ్లాల్సి ఉంటుంది. ఈ గుడికి మరో దారి లేదు. ఇలాంటి రోడ్డును క్లోజ్ చేయడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో రాజస్థాన్ కు చెందిన లాయర్ నేత్రబింద్ సింగ్ కత్రినా – విక్కీ పెళ్లిపై ఫిర్యాదు చేశారు.

ఒకట్రెండు రోజులు ఆలయానికి దారి మూసేస్తే సరిపెట్టుకోవచ్చు కానీ 6వ తేదీ నుంచి ఆ దారి మూసేశారని.. తిరిగి 12వ తేదీ సాయంత్రం తెరుస్తారట అని చెప్పుకొచ్చారు నేత్రబింద్. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. ఓవర్ యాక్షన్స్ చేస్తే అలానే ఉంటుంది మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news