Moviesబాల‌య్య‌తో అల‌నాటి స్టార్ హీరోయిన్ రిపీట్‌... కేక పెట్టించే కాంబినేష‌నే...!

బాల‌య్య‌తో అల‌నాటి స్టార్ హీరోయిన్ రిపీట్‌… కేక పెట్టించే కాంబినేష‌నే…!

యువ‌ర‌త్న బాల‌కృష్ణ ప్ర‌స్తుతం ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. ఓ వైపు అఖండ ఇప్ప‌టికే రు. 100 కోట్ల క్ల‌బ్ దాటేసి దూసుకుపోతోంది. ఈ సినిమా స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న బాల‌య్య మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా వ‌చ్చే స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మ‌రోవైపు బుల్లితెర‌పై అన్‌స్టాప‌బుల్ షో కూడా చేస్తున్నాడు.

ఈ షో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. బాల‌య్య దెబ్బ‌తో అన్‌స్టాప‌బుల్ షోతో పాటు ఆహా ఓటీటీ రేంజ్ బాగా పెరిగింద‌నే చెప్పాలి. ఇక మ‌లినేని గోపీచంద్ సినిమా షూటింగ్‌కు రెడీ అవుతోన్న బాల‌య్య ఆ వెంట‌నే అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాకు కూడా గ్రీన్ సిగ్న‌ల్ అయితే ఇచ్చేశాడు. ఇదిలా ఉంటే బాల‌య్య‌కు సంబంధించి ఇప్పుడు అదిరిపోయే అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

బాల‌య్య – విజ‌య‌శాంతి కాంబినేష‌న్‌కు ఉన్న క్రేజ్ తెలిసిందే. వీరిద్ద‌రు క‌లిసి ఎన్నో సినిమాల్లో న‌టించారు. అందులో ఎన్నో సూప‌ర్ హిట్లు ఉన్నారు. వీరిద్ద‌రు క‌లిసి చివ‌రి సారిగా కోదండ రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన నిప్పుర‌వ్వ సినిమాలో న‌టించారు. ఈ బ్యాన‌ర్‌ను విజ‌య‌శాంతి సొంతంగా యువ‌ర‌త్న బ్యాన‌ర్‌పై నిర్మించారు. ఆ త‌ర్వాత వీరి కాంబినేష‌న్లో ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా రాలేదు.

మ‌ళ్లీ ఇన్ని సంవ‌త్స‌రాల త‌ర్వాత ఇప్పుడు వీరి కాంబినేష‌న్ రిపీట్ కానుంద‌న్న వార్త చ‌క్కెర్లు కొడుతోంది.
మైత్రీ మూవీస్ వారు మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించే సినిమాలో బాల‌య్య డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నాడు. ఒక‌టి ఫ్యాక్ష‌నిస్ట్ పాత్ర అయితే రెండోది పోలీస్ పాత్ర‌. వీరిద్ద‌రు తండ్రి, కొడుకులుగా న‌టిస్తున్నార‌ట‌. ఇందులో కొడుకు పాత్ర‌కు ఇప్ప‌టికే శృతీహాస‌న్ హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది.

తండ్రి పాత్ర ప‌క్క‌న విజ‌య‌శాంతిని హీరోయిన్‌గా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌హేష్‌బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో వెండితెర‌పై రీ ఎంట్రీ ఇచ్చాక విజ‌య‌శాంతి మ‌ళ్లీ సినిమా చేయ‌లేదు. ఇప్పుడు మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు బాల‌య్య‌కు జోడీగా న‌టించ‌డం సంచ‌ల‌న‌మే అని చెప్పాలి. ఇన్నేళ్ల గ్యాప్ త‌ర్వాత ఈ జోడీ వెండితెర‌పై ఎలా వీనుల విందు చేయ‌బోతుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news