Moviesటాలీవుడ్ బడా ఫ్యామిలీ హీరోతో చిన్మయి బిగ్ స్క్రీన్ ఎంట్రీ..!!

టాలీవుడ్ బడా ఫ్యామిలీ హీరోతో చిన్మయి బిగ్ స్క్రీన్ ఎంట్రీ..!!

సింగర్ చిన్మయి శ్రీపాద.. తమిళ రైటర్ వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ సంచలన ఆరోపణలతో మీటూ ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొన్న సంగతి తెలిసిందే. కేవలం సింగర్ గానే కాకుండా సామాజిక అంశాలపై గళం ఎత్తుతూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు సింగర్ చిన్మయి. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతూ.. సంచలన విషయాలతో హాట్ టాపిక్ అయ్యారు సింగర్ చిన్మయి. సోషల్ మీడియాలో ఎప్పూడు యాక్టివ్‌గా వుండే ఈ సింగర్ తనదైన స్టైల్‌లో ఆడపిల్లలపై జరుగుతున్న లైంగింక వేధింపులను అడ్రెస్ చేస్తూ అవసరమున్నవారికి అండగా ఉంటోంది.

తాజాగా చిన్మయి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అది ఏంటంటే..సింగర్‌గా..డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు నటిగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తన స్వీట్‌ వాయితో పాటలు పాడుతూ.. హీరోయిన్లకు డబ్బింగ్‌ చెబుతూ.. పాపులర్ అయిన చిన్మయి అక్కినేని వారసుడు అఖిల్ సినిమా తో నటి గా మారనుందనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌లుక్‌లు, పోస్టర్లు, టీజర్‌ విడుదలై ఆకట్టుకొన్నాయి.

అయితే నేడు చిన్మయి పుట్టిన రోజు సందర్బంగా ఆమె ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఆమెను అభినందిస్తూ.. ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌”లో చిన్మయి, రాహుల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరిద్దరూ సినిమాలో కలిసి నటించడం ఇదే మొదటిసారి. అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గోపీ సుంద‌ర్ సంగీత‌ సార‌ధ్యంలో హ్యాపెనింగ్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన మనసా మ‌న‌సా పాట, ఆ తర్వాత వచ్చిన రెండు పాటలు, అలాగే టీజ‌ర్‌కు అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్‌లో కొత్త ఉత్సాహ‌న్ని తెచ్చింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news