Moviesఆచార్య ధ‌ర్మ‌స్థ‌లి నుంచి అదిరే స‌ర్‌ప్రైజ్‌

ఆచార్య ధ‌ర్మ‌స్థ‌లి నుంచి అదిరే స‌ర్‌ప్రైజ్‌

మెగా అభిమానులకు మరో అదిరిపోయే సర్ప్రైజ్ వచ్చేసింది. ఆచార్య సినిమా నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ హీరోయిన్‌గా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య‌ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తండ్రి కొడుకులు అయిన చిరంజీవి – రామ్‌చ‌ర‌ణ్ సంయుక్తంగా న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం కీలక పాత్రలో నటిస్తుండ‌డంతో ఎవ‌రి రోల్స్ ఎలా ఉంటాయా ? అన్న ఆస‌క్తి అయితే ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన‌ చిరంజీవి లుక్ అభిమానులను పిచ్చ‌గా న‌చ్చేసింది.

ఇప్పుడు ధర్మస్థలి (ఆల‌యం) కి ద్వారం తెరుచుకుంది. చివరి షెడ్యూల్లో ఉన్నామంటూ చిత్రయూనిట్ ప్రకటించడంతో పాటు త్వరలో మరో స‌ర్‌ఫ్రైజ్ ఇస్తామ‌ని ప్రకటన చేసింది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయనున్నారు. కరోనా కారణంగా ఏడాది కాలం పాటు ఆచార్య షూటింగ్ నిలిచిపోయింది. త్వ‌ర‌లోనే పోస్ట్‌ ప్రొడక్షన్ ప‌నులు పూర్తి చేయ‌నున్నారు. కొణిదెల కంపెనీ – మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రామ్చరణ్ సరసన పూజా హెగ్డే కీలక పాత్రలో కనిపిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news