Politics12 ఏళ్ల బాలిక‌పై ఐదు నెల‌లుగా మైన‌ర్ల‌ అత్యాచారం.., ఎంత‌మందో తెలుసా..!

12 ఏళ్ల బాలిక‌పై ఐదు నెల‌లుగా మైన‌ర్ల‌ అత్యాచారం.., ఎంత‌మందో తెలుసా..!

యూపీలోని హాథ్రస్ ఘటన మరవక ముందే గుజరాత్‌లో మ‌రో దారుణం జ‌రిగింది. 12 ఏళ్ల బాలిక‌పై కొందరు మృగాళ్ల చేతుల్లో బ‌లైపోయింది. గుజరాత్‌లోని న‌వ‌స‌రి జిల్లాలో ఓ వ్య‌వ‌సాయ కూలీ కుమార్తె అయిన 12 ఏళ్ల బాలిక‌పై ఆమె ఇంటి స‌మీపంలోనే ఉన్న ముగ్గురు బాలురు గ‌త ఐదు నెల‌లుగా అత్యాచారం చేస్తూనే ఉన్నారు. దీంతో ఆమె గ‌ర్బం దాల్చ‌డంతో ఆసుప‌త్రిలో చేర్పించారు. స‌ద‌రు బాలిక‌కు స‌మీప బంధువు అయిన ఓ బాలుడు ఆమెపై ముందుగా అత్యాచారం చేసి ఆ విష‌యం ఎవ్వ‌రికి చెప్ప‌వ‌ద్ద‌ని బెదిరించాడు.

Bareilly Rape Case: Minor abducted, gang raped by four youths, 2 held »

వారిద్ద‌రి క‌ల‌యిక‌ను చూసిన మ‌రో ఇద్ద‌రు బాలురు కూడా ఆమెపై అత్యాచారం చేయ‌డంతో చివ‌ర‌కు ఆమె గ‌ర్బం దాల్చింది. బాలురు అంతా 18 ఏళ్ల లోపు వారే. ఆమెకు క‌డుపు నొప్పి రావడంతో త‌ల్లి ఆసుప‌త్రికి తీసుకువెళ్ల‌గా ఆమె ఐదో నెల గర్భ‌వ‌తి అని చెప్పారు. దీంతో బాలిక‌ను చికిత్స కోసం మ‌రో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చివ‌ర‌కు బాధిత బాలిక త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా.. బాలిక‌తో పాటు ఆమె త‌ల్లిదండ్రుల వాంగ్మూలాన్ని పోలీసులు న‌మోదు చేశారు.

 

ముగ్గురు బాలురపై కేసు నమోదు చేశామని వారు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు వివరించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news