News‘కిలాడీ’ పెళ్లికూతురు.. శోభనం రాత్రి ఏం చేసిందో తెలిస్తే షాకే!

‘కిలాడీ’ పెళ్లికూతురు.. శోభనం రాత్రి ఏం చేసిందో తెలిస్తే షాకే!

Newly married woman shocks everyone by her behaviour. First she gave sleeping pills to her husband on first night, and wait for some time. When he went to sleep, she runs away with gold and cash without knowing anyone. By this incident, her husband family shocked and complaint against her.

పెళ్ళికిముందు ఎంత రొమాన్స్ చేసినా.. శోభనంనాడు చేసే ఎంజాయ్‌లో ఆ కిక్కే వేరుంటుంది. అందుకే.. ప్రతి మగాడు ఆరోజు కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటాడు. ఆ రాత్రి తన జీవితంలో ప్రత్యేక అనుభూతిగా మిగిలిపోవాలని కోరుకుంటాడు. అలాగే ఓ వ్యక్తి కలలు కన్నాడు కానీ.. అది రివర్స్‌లో అతనికి కాలరాత్రిగా మారింది. పెళ్ళికూతురు చేసిన బాగోతానికి ఆ పెళ్లికొడుక్కి ఎప్పటికీ మరచిపోలేని చేదు అనుభవం మిగిలింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లాలోని మోదీనగర్‌కి చెందిన ఓ యువకుడికి రీసెంట్‌గా ఒక అమ్మాయితో ఘనంగా వివాహం అయ్యింది. సంప్రదాయాల ప్రకారం.. ఇరువురి ఫ్యామిలీలు ఈ పెళ్ళి వేడుకను అంగరంగ వైభవంగా జరిపించారు. అంతా అయిపోయాక.. ఆ దంపతుల్ని శోభనం గదిలోకి పంపారు. బెడ్‌రూంలోకి వెళ్ళాక పెళ్లికూతురు తన భర్తని మత్తుమాటల్లో పడేసింది. ఆ కార్యం కోసం అతగాడు తపిస్తుంటే.. ఇప్పుడే వద్దంటూ మాటలు అల్లేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే అమ్మడు తన వెంట తెచ్చుకున్న నిద్రమాత్రల్ని పాలులో కలిపి.. అతనికి తాగించింది. అది తాగి మనోడు నిద్రలోకి జారిపోయాడు. అటు.. అత్తమామలు కూడా నిద్రపోయారు.

ఇదే మంచి సమయం అని భావించిన ఆ పెళ్ళికూతురు.. ఇంట్లో ఉన్న నగదు, నగలు తీసుకుని.. ఎవరికీ తెలియకుండా తుర్రుమని ఉడాయించింది. తెల్లారిన తర్వాత అత్తమామలు గదిలోకి వెళ్ళి చూస్తే.. వారికి మత్తులో జోగుతున్న తమ కుమారుడు కనిపించాడు. అతని పక్కనే ఉండాల్సిన కోడలు కనిపించలేదు. దీంతో.. మొదట వారు కంగారుపడ్డారు. ఏమయ్యిందోనని ఆందోళన చెందారు. అయితే.. అక్కడున్న ఆనవాలు చూసి, పెళ్లికూతురు తమని మోసం చేసిందని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఆమెకోసం గాలిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news