Moviesహీట్ పెట్టించే కాంబో ..బావ కోసం మరదల పిల్ల రెడీ..!?

హీట్ పెట్టించే కాంబో ..బావ కోసం మరదల పిల్ల రెడీ..!?

తెరపై కొన్ని జోడీలు చూడటానికి భలే ముచ్చటగా ఉంటాయి. రియల్ హస్బెండ్ అండ్ వైఫ్ కాకపోయినా సరే అలాగే కనిపిస్తారు వాళ్ళు . మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఎన్టీఆర్-శ్రీదేవి, ఆ తర్వాత ఏఎన్ఆర్-శ్రీదేవి ఇక ఆ తర్వాత బాలకృష్ణ-విజయశాంతి , ఎన్టీఆర్-బాలకృష్ణ, చిరంజీవి-సౌందర్య, వెంకటేష్-సౌందర్య ,నాగార్జున-డబ్బు ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు మంది. ఈ క్రేజీ కాంబో పడితేనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని ఫిక్స్ అయిపోయే జనాలు కూడా ఉన్నారు. అలాంటి ఓ క్రేజీ కాంబో ని సెట్ చేశాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నమ్మి ఏదైనా పని చేశాడంటే ..మాత్రం అది కచ్చితంగా సక్సెస్ అవ్వాల్సిందే.. ఇప్పటివరకు ఆయన కెరియర్లో చేసిన సినిమాలన్నీ అలాగే చేశాడు. బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలు కూడా బుల్లితెరపై సక్సెస్ సాధించి రికార్డులు కొల్లగొట్టాయి. అయితే ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు తో ఎస్ ఎస్ ఎం బి 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మధ్యనే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే కన్ఫర్మ్ అయింది. ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు ఎప్పుడో పూర్తయ్యాయి. కానీ అనివార్య కారణాల వల్ల షూటింగ్ కి బ్రేక్ పడుతూ పడుతూ పడుతూ ఈ మధ్యనే స్టార్ట్ అయింది. అయితే రీసెంట్ గానే మహేష్ బాబు అమ్మగారు చనిపోవడంతో ఆయన మిగతా కార్యక్రమాలలో బిజీగా ఉండడం కారణంగా ఈ సినిమా షూటింగ్ స్టాప్ చేశారు. త్రివిక్రమ్ ఈ సమయంలోనే సినిమాలోని సెకండ్ హీరోయిన్ గురించి కాన్సన్ట్రేషన్ చేస్తున్నారట.

అంతేకాదు సినిమాలో మహేష్ బాబు మరదలిగా సెకండ్ హీరోయిన్ నటిస్తుందని ఎప్పటినుంచో వార్తలు వైరల్ అవుతున్నాయి . ఈ క్రమంలోనే మరదలు పిల్ల కోసం మహేష్ బాబు కు జోడిగా యంగ్ బ్యూటీ శ్రీ లీలాను సెలెక్ట్ చేశాడట త్రివిక్రమ్. ఈ క్యారెక్టర్ కోసం కృత్తి శెట్టి శ్రీలల ఇద్దరినీ కంపేర్ చేసుకున్నారట. ఇద్దరిలో పోలిస్తే శ్రీ లీల ఈ పాత్రకు బాగా సూట్ అవుతుందని.. ఈ క్రమంలోనే ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది .అదే కనుక నిజమైతే తెరపై బావ మరదల్ల సరసాలు ఓ రేంజ్ లో ఉంటాయి అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news