Moviesమోకాళ్లతో శ్రీవారి మెట్లు ఎక్కిన జాన్వీ కపూర్..ఎందుకో తెలుసా..?

మోకాళ్లతో శ్రీవారి మెట్లు ఎక్కిన జాన్వీ కపూర్..ఎందుకో తెలుసా..?

జాన్వి కపూర్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతున్న పేరు . అమ్మడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. శ్రీదేవి కూతురు అని కాదు కానీ పర్ఫెక్ట్ ఫిజిక్ హీరోయిన్ కి ఉండాల్సిన క్వాలిటీలు అన్ని కూడా జాన్వికపూర్ లో ఉన్నాయి. అంతేకాదు బాలీవుడ్ ఇండస్ట్రీని తన అంద చందాలతో ఏలేస్తున్న బ్యూటీ. త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దున్నుకు పోవడానికి సిద్ధమవుతుంది.

తాజాగా జాన్వి కపూర్ – రాంచరణ్ సరసన నటించే అవకాశం కూడా కొట్టేసింది . బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమాలో మొదటి హీరోయిన్ గా సెలెక్ట్ అయింది జాన్వి కపూర్ . కాగా రీసెంట్గా జాన్వి కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి స్నేహితులతో ..తన బాయ్ ఫ్రెండ్ షిఖర్ పెహరియాతో.. కాలినడక మెట్ల మార్గం గుండా వెళ్లడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది.

అంతేకాదు జాన్వి కపూర్ మోకాల పర్వతం దగ్గర మోకాళ్ళతో తిరుమల మెట్లు ఎక్కిన పిక్చర్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . జాన్వి కపూర్ మొదటి నుంచి తిరుమల శ్రీవారిని బాగా నమ్ముతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. మరోసారి తాను దేవుడిని ఎంతలా ఆరాధిస్తుందో అన్న విషయం ఈ ఫొటోస్ తో బయటపడింది . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది . అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా సెటిల్ అవ్వలేకపోయిన జాన్వి కపూర్ కనీసం తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి ఇలా చేస్తుంది అని కొందరు వ్యంగ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news