Movies"ఏ రా త్రివిక్రమ్ కళ్ళు దొబ్బాయా బే".. గుంటూరు కారం పై...

“ఏ రా త్రివిక్రమ్ కళ్ళు దొబ్బాయా బే”.. గుంటూరు కారం పై జనాలు బూతులు..ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు తాజాగా నటించిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది . అయితే సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేం కానీ మహేష్ సినిమాకి హైలైట్ గా నిలిచాయి . అయితే కొంతమంది జనాలు మాత్రం ఈ సినిమా చూసి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ను తిట్టిపోస్తున్నారు .

కళ్ళు దొబ్బాయా..? మా మహేష్ తో ఇలాంటి చెత్త సినిమా తీస్తావా ..?? అంటుంటే మరికొందరు అసలు మహేష్ బాబు ఈ కథను ఎలా అంగీకరించాడు అంటూ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు పలువురు ఐపీఎస్ లు కూడా ఈ సినిమాపై మండిపడుతున్నారు. ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ గుంటూరు కారం సినిమాపై ఘాటుగా స్పందించారు. తాను ఈ సినిమా చూడనని దళితులను కించపరిచే ఈ దర్శకుడిని హీరోను దళితులంతా బాయ్ కాట్ చేయాలి అంటూ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.

చాలామంది త్రివిక్రమ్ పై ఫైర్ అవుతున్నారు . ఈ సినిమాలో దళితులను కించపరిచారు అని .. దళితులను కించపరిచే విధంగా విలన్లకు ఆ పేర్లు పెట్టడమే తప్పు అని .. హీరోకు మందు పోస్తూ బతికే వాడి పేరు యాకోబు అంటూ పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమా ఒక వెక్కిలిగా ఉంది అని ఫైర్ అవుతున్నారు. కులతత్వంతో నిండిపోయిన త్రివిక్రమ్ మైండ్ దొబ్బింది అంటూ ఘాటుగా ఫైర్ అవుతున్నారు. నువ్వు క్రిస్టియన్ వా బే అని మహేష్ బాబు వెటకారంగా అడిగే సీన్లను దళితులను కించపరిచే విధంగా ఉన్నాయి అంటూ మండిపడుతున్నారు. అలాగే బ్రోకరిజం చేసే కమెడియన్ పేరు బాలసుబ్రహ్మణ్యం గా పెట్టి ఆయన పరువు తీశారు అని మండిపడుతున్నారు .ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలి అంటూ మండిపడుతున్నారు. దీంతో గుంటూరు కారం సినిమాపై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతున్నాయి ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news