Moviesమహేష్ బాబు ఫ్యాన్స్ కి మంచి ఊపు ఇచ్చే వీడియోని షేర్...

మహేష్ బాబు ఫ్యాన్స్ కి మంచి ఊపు ఇచ్చే వీడియోని షేర్ చేసిన నమ్రత.. ఇక “కుర్చీలు మడతపెట్టాల్సిందే”..!!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాకి సంబంధించిన పోస్టర్స్ .. డైలాగ్స్.. పాటలు వైరల్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా రీసెంట్గా రిలీజ్ అయిన కుర్చీ మడత పెట్టి సాంగ్ రెండు రాష్ట్రాలను షేక్ చేసి పడేస్తుంది . మాటల మాత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా జనవరి 12వ తేదీ రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో గుంటూరు కారం ఫీవర్ కనిపిస్తుంది.

రీసెంట్గా సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యి అభిమానులను బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాగా హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో ఈ మూవీ ట్రైలర్ ని ప్రదర్శించారు . దీంతో మహేష్ ఫ్యాన్స్ థియేటర్ వద్ద చేరుకొని చేసిన సందడి అంతా కాదు . . ఒక సినిమా రిలీజ్ అయితే ఏ విధంగా హంగామా చేస్తారో అంతకు డబల్ రేంజ్ లో చేశారు అక్కడ డిజె సాంగ్స్ అండ్ డప్పులతో ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేశారు.

ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ నే సినిమా రిలీజ్ అంత ఘనంగా నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్ కి మహేష్ బాబు భార్య నమ్రత కూడా ఫిదా అయిపోయారు. సుదర్శన్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్స్ కి సంబంధించిన ఒక వీడియోని నమ్రత తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది . దీనితో మహేష్ ఫ్యాన్స్ కి మరింత ఊపు వచ్చింది . అందుకే కుర్చీని మడతపెట్టి అంటూ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు . ప్రెసెంట్ నమ్రత షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news