Moviesత్వరలోనే మహేశ్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. ఘట్టమనేని ఫ్యాన్స్ కి...

త్వరలోనే మహేశ్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. ఘట్టమనేని ఫ్యాన్స్ కి ఊపు తెప్పించే న్యూస్ ఇది..!

మహేష్ బాబు రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో అభిమానులను పలకరించాడు. ఈ సినిమా హిట్టా పట్టా అని పక్కన పెడితే .. కలెక్షన్స్ పరంగా మాత్రం దుమ్ము దులిపేస్తుంది. ఏకంగా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి మహేష్ బాబు కెరీర్ లో సంచలన రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటికే మహేష్ బాబు ఇంట్లో ఆల్రెడీ గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరుపుకున్నారు .

అంతేకాదు త్వరలోనే ఓ ఈవెంట్ లా సక్సెస్ సెలబ్రేషన్స్ చేయబోతున్నారు . కానీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వేరే సినిమా పనుల్లో బిజీగా ఉండడంతో ఈ ఈవెంట్ ని పోస్ట్ పోన్ చేసుకున్నట్లు తెలుస్తుంది . ఇక ఇదే క్రమంలో మహేష్ బాబు జర్మనీకి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది . రీసెంట్గా ఎయిర్పోర్టులో నమ్రత ఆయనకి సెండ్ ఆఫ్ ఇస్తూ కనిపించారు. అయితే ఎప్పటిలాగే సినిమా అయ్యాక రిఫ్రెష్ కోసం మహేష్ బాబు ఫారన్ కంట్రీస్ కి వెళ్లారు అనుకుంటే పొరపాటే .

ఈసారి మహేష్ బాబు భారీ ప్లాన్ తోనే జర్మనీ వెళ్ళాడు అంటూ తెలుస్తుంది . గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి . ఈ సినిమాకి సంబంధించిన టెక్నికల్ అంశాల కోసం మహేష్ బాబు జర్మనీ వెళ్లినట్లు తెలుస్తుంది . పూర్తి సమాచారం పై క్లారిటీ రాకపోయినా రాజమౌళి సినిమాకు సంబంధించిన వర్క్ షాప్ కోసమే మహేష్ బాబు జర్మనీకి వెళ్ళాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ప్రెసెంట్ మహేష్ బాబు జర్మనీకి వెళుతున్న ఎయిర్పోర్ట్ దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news